భక్తిభావంతో పులకించాల్సిన కోటప్పకొండ శివరాత్రి తిరునాళ్లు.. ఈసారి ‘మద్యం’ ఘాటుతో వార్తల్లోకి ఎక్కాయి. కలెక్టర్ గారు మూడు రోజుల పాటు చుట్టుపక్కల మద్యం అమ్మకాలను కఠినంగా నిషేధిస్తే, క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ రివర్స్ అయింది.
శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే స్వయంగా సేల్స్ మెన్ అవతారమెత్తడం ఇక్కడ విశేషం. ‘కోటి’ అనే హోంగార్డు తన డ్యూటీని గాలికి వదిలేసి, భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా మద్యం అమ్ముతూ అడ్డంగా దొరికిపోయాడు.
“లెమన్ సోడాలు, మజ్జిగలు అమ్మే రోజులు పోయాయి.. కూటమి ప్రభుత్వంలో నేరుగా పోలీసులే మద్యం సరఫరా చేసే స్థాయికి ఎదిగారు!” అంటూ భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షాత్తూ ప్రభుత్వ యంత్రాంగమే మద్యం విక్రయాల్లో తలమునకలవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి పనులు చేస్తున్న హోంగార్డుపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

