Top Stories

వైసిపి తగ్గేదేలే..

‘నీయవ్వ తగ్గేదేలే’ ఇది ఒక సినిమాలో ప్రముఖ నటుడు చెప్పే డైలాగ్. కానీ ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఇదే డైలాగును బలంగా చెబుతున్నారు. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత వైసిపి పని అయిపోయిందంటూ ఎంతోమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఆ పార్టీలో ఎవరు ఉండరు అన్న వాదనను ఎంతోమంది వినిపిస్తున్నారు. అటువంటి వారికి వైసిపి శ్రేణులు, ఫాలోవర్స్ గణాంకాలను చూపించి మరి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా 2014లో ఎదుర్కొన్న పూర్తిస్థాయి ఎన్నికల్లో 44.9% ఓటు బ్యాంకును వైసిపి సాధించింది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 49.95% ఓటింగ్ తో తొలిసారి అధికారాన్ని దక్కించుకుంది. గతంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 151 స్థానాల్లో వైసిపి విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఐదేళ్లు గడిచాయి 2024లో జరిగిన ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ ఓటమిపాలైంది. 11 స్థానాలే వచ్చినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీకి 40 శాతం మంది ఓట్లు వేశారు. ఇప్పటికీ సింగిల్ గా పోటీ చేస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మించిన బలమైన పార్టీ మరొకటి లేదంటూ పలు సర్వే సంస్థల అధినేతలు పేర్కొన్నారు. వైసీపీకి గడిచిన ఎన్నికల్లో వచ్చిన 40 శాతం మంది ఓటర్లలో ఒక్కరిని కూడా బయటకు పంపించలేరని, వారంతా జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లు వేసిన వారిని ఆ పార్టీ అభిమానులు చెబుతున్నారు.

ప్రస్తుత ప్రభుత్వ విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చక వైసీపీ వైపు వచ్చే వాళ్ళు ఉంటారే తప్ప.. ఈ 40 శాతం మందిలో అటువైపు వెళ్లే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు అంటూ బలంగా వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. తమ పార్టీ పని అయిపోయింది అని భావించే వాళ్లకు ఈ గణాంకాలను చూపించి ఇది తమ సత్తా అంటూ స్పష్టం చేస్తున్నారు. ఏపీలో ఉన్న పార్టీలు తల కింద పెట్టి కాలు పైన పెట్టిన కూడా ఎంత ఓట్ షేర్ రాదు అంటూ శపథలు చేస్తున్నారు. వైసీపీ శ్రేణులు ఈ గణాంకాలతో కూడిన కొన్ని వీడియోలను షేర్ చేస్తూ ‘తగ్గేదేలే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే వైసిపి తగ్గేదే లేదు అన్నట్టుగానే ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో అది వైసీపీకి మరింత బలంగా మారే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అదే జరిగితే జమిలి ఎన్నికలు జరిగినా, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వచ్చిన వైసీపీ విజయాన్ని ఆపే సత్తా ఎవరికి ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు.

https://x.com/bhargavreddyyy/status/1848784700644696529?t=LIw0lA7aVn-tYXfkbaAdRw&s=08

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories