Top Stories

గడ్డి పీకుతున్నావా పీకే.. పవన్ కళ్యాణ్ కు ఇచ్చిపడేసిన జడా శ్రవణ్

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై జై భీమ్ రావు పార్టీ అధినేత జడ శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో మహిళల మిస్సింగ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనిపించకుండా పోయిన ఆడపిల్లల గురించి ఎందుకు మాట్లాడటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో గడిచిన కొద్ది రోజుల నుంచి 25 మంది మహిళలు కనిపించడం లేదంటూ ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని, వీటిపైన పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ గతంలో వ్యక్తం చేసిన ఉద్దేశం ప్రకారం వీరందరినీ ఏ విదేశాలకు తీసుకువెళ్లి అమ్మేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఉపముఖ్యమంత్రి గతంలో చెప్పిన దాని ప్రకారం చూస్తే వీరంతా వ్యభిచార వృత్తిలోకి వెళుతున్నట్టుగానే భావించాలా.? అని జడ శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో మహిళలు కనిపించకుండా పోయిన ఆయనకు పట్టడం లేదని, పవన్ కళ్యాణ్ కుప్పం నియోజకవర్గానికి కూడా డిప్యూటీ సీఎం కాబట్టి దీనిపై దృష్టి సారించాలని ఆయన కోరారు. కుప్పం నియోజకవర్గంలో ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతోందని, దీనిపై సీఎం స్పందిస్తున్నారో లేదో తెలియడం లేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మిస్ అయిన ఆడ పిల్లలు బతికున్నారో.. లేదో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కనిపించకుండా పోయిన ఆడపిల్లల జీవితాలు గురించి తన ఆందోళన అంతా అని, సదరు మహిళల గురించి డిప్యూటీ సీఎం ఒక్క ఫోన్ కాల్ చేయాలని సూచించారు.

కుప్పం నియోజకవర్గంలోని పోలీసులకు డిప్యూటీ సీఎం ఫోన్ చేస్తే హెలికాప్టర్ లో వెళ్లి అమ్మాయిలను తీసుకువస్తారంటూ వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను తాను ఒకటే కోరుతున్నానని, కనిపించకుండా పోయిన అమ్మాయిలు గురించి పట్టించుకోవాలన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అన్ స్టాపబుల్ లో బిజీగా ఉన్నారని, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని పట్టించుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తే మిలిటరీ హెలికాప్టర్లు మొత్తం దిగుతాయని, కనిపించకుండా పోయిన అమ్మాయిలు అందరిని తీసుకువస్తారంటూ వ్యాఖ్యానించారు. స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం లో జరుగుతున్న ఈ వ్యవహారాలపైన దృష్టి సారించాలని ఆయన అంటూ పవన్ కళ్యాణ్ కు ఆయన సూచించారు. ‘నాయన సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ చెప్తున్నా విను ఇవన్నీ ఎఫ్ఐఆర్లు సిగ్గుండాలి. మీ ముఖ్యమంత్రి కార్యాలయానికి.. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఉన్నవాళ్ళకి’ అంటూ జై భీమ్ పార్టీ అధినేత జడ శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జడ శ్రవణ్ మాట్లాడిన మాటలు, గతంలో అమ్మాయిల మిస్సింగ్ కేసులకు సంబంధించి పవన్ కళ్యాణ్ వైసీపీపై చేసిన ఆరోపణల వీడియోను మిక్స్ చేసి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పలువురు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories