Top Stories

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సుద్దులు.. వైరల్ వీడియో

నీతి సూత్రాలు చెప్పడానికి తప్ప ఆచరించడానికి పనికిరావు అన్నచందంగా తయారయ్యారు కూటమి నాయకులు, యెల్లో మీడియా అధిపతులు. ఈ విషయాన్ని మరోసారి నిర్ధారిస్తూ టీవీ5 సంస్థ అధినేత బీఆర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు నియమితులయ్యారు. కొత్త పాలక మండలి ఏర్పాటైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయిస్తున్నాయి. నీతి, నిజాయితీగా పనిచేయాలనుకుంటున్నాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తిరుమల అంటే కొంతమందికి గిట్టదని ఈ మీడియా వాళ్లకు ఎందుకో మరి తెలియదు అంటూ ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం విమర్శలకు కారణం అవుతుంది.

వేరే టెంపుల్స్ గాని, వేర్వేరు వాటికిగాని జోలికి పోరు, తిరుమల అంటే ఒంటి కాలు మీద వస్తారు అంటూ బిఆర్ నాయుడు సుద్దులు చెప్పే ప్రయత్నం చేశారు. కరెక్టుగా ఉంటే వార్తల రాయండి అని తాను తల వంచి యాక్సెప్ట్ చేస్తానని వెల్లడించారు. తప్పుడు వార్తలు రాయొద్దని సూచించారు. కరెక్ట్ వార్తలు రాస్తే తాను కాదనడం లేదని, తిరుమల అనే పవిత్ర ఏదైతే ఉందో దాన్ని మాత్రం పాడు చేయవద్దని ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.

బిఆర్ నాయుడు మాట్లాడిన మాటలకు.. గతంలో టీవీ5 లో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ప్రచురించిన కథనాలకు సంబంధించిన అంశాలతో కూడిన వీడియోను జత చేసి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోని చూసిన ఎంతోమంది నెటిజన్లు అబ్బబ్బో నాయుడు ఎన్నెన్ని సూక్తులు చెబుతున్నారో అని కామెంట్లు చేస్తుండగా, మరికొందరైతే ఈ సుద్ధులు చెప్పడానికే తప్ప తాము ఆచరించడానికి కాదన్న విషయం ఈయన ఎప్పుడో నిజం చేశారంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories