Top Stories

అయ్యా ఏబీఎన్ రాధాకృష్ణ.. ఇదేమి పని?

’చెప్పేవి శ్రీరంగ నీతుల.. దూరేవి దొమ్మర గుడిసెలు’ అన్న చందంగా తయారైంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పరిస్థితి. తెల్లవారి లేచిన దగ్గర నుంచి సమాజాన్ని తానే ఉద్ధరిస్తున్నానన్నట్టుగా ఈ సంస్థ ఎండీ వ్యవహరిస్తుంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి నీతి వాఖ్యాలను వల్తెవేస్తుంటారు. కానీ, చేసే వ్యవహారాలు వేరేగా ఉంటాయి. ఇవన్నీ అందరికీ తెలిసినవే. అయితే, గొప్పగొప్ప మాటలు చెప్పే రాధాకృష్ణ తన సంస్థలో పని చేసే ఉద్యోగులు విషయంలో మాత్రం అత్యంత నిర్లక్ష్యంగా కఠినంగా వ్యవహరిస్తున్నాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థలో పని చేసే ఉద్యోగులకు పెద్దగా జీతాలు ఉండవు. చాలీ, చాలని జీతాలతోనే నెట్టుకుంటూ రావాలి. ఇచ్చే జీతాల్లోనూ ఆ సంస్థ వెల్ఫేర్‌ ఫండ్‌ పేరుతో కొంత కోతలు విధిస్తోంది. ఇదే ఇప్పుడు ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది.

చాలీ, చాలని జీతాల్లో నుంచి కోతలు విధించడంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో వెల్ఫేర్‌ ఫండ్‌ పేరుతో వసూలు చేసిన మొత్తంలో నుంచి ఎవ్వరికి సాయం చేశారో కూడా తెలియడం లేదు. ఈ ఫండ్‌ నుంచి ఎవరైనా రుణం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలంటూ సవాలక్ష నిబంధనలు పెట్టారు. దీంతో ఈ ఫండ్‌ కూడా ఎవరికీ ఉపయోగపడని పరిస్థితి. అదే సమయంలో ఉద్యోగులకు వేతనాలను ఎలా కోత విధించాలన్న దానిపైనే సంస్థ యాజమాన్యం దృష్టి పెట్టినట్టు అనేక నిబంధనలు పెట్టింది. ఈ సంస్థలో ఎడిటోరియల్‌లో పని చేసే సబ్‌ ఎడిటర్లకు ఖచ్చితంగా ఇన్‌పంచ్‌, ఔట్‌ పంచ్‌ ఉండాలి. ఇందులో ఒక్క నిమిషం ఆలస్యమైనా వేతనం కట్‌ అవుతుంది.

అదనంగా పని చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం దాన్ని పరిగణలోకి తీసుకోరు. ఈ సంస్థలో గతంలో గ్రేస్‌ పీరియడ్‌ 350 నిమిషాలు వరకు ఉండేది. దాన్ని కొంత కాలంగా తగ్గించుకుంటూ వచ్చి రద్దు చేశారు. సబ్‌ ఎడిటర్లు పత్రికా ఆఫీస్‌కు వచ్చే సమయంలో ఐదు, పది నిమిషాలు ఆలస్యమైనా జీతాల్లో కోత విధిస్తారు. ఓవర్‌ టైమ్‌ చేయాల్సి వచ్చినప్పుడు అదనంగా రూపాయి కూడా చెల్లించరు. ఇవన్నీ భరిస్తూ కూడా చాలా మంది పని చేస్తూనే ఉన్నారు. దీనికి కారణం మీడియారంగంలో సరైన అవకాశాలు లేకపోవడమే. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఉద్యోగులు విషయంలో చేస్తున్న విషయాలను తెలుసుకున్న ఎంతో మంది.. అయ్యా రాధా ఇదేమి పని అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఆడింట్లో, ఈడింట్లో ఏం జరిగిందో చెప్పడమే తప్పా.. మనింట్లో, మన సంస్థలో ఏం జరుగుతుందో పట్టించుకోమా సామీ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇదేంటి ఆర్కే అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories