‘పీకే’లేరా.. పరువు తీసిన టీవీ5.. వైరల్ వీడియో

సాధారణంగా ఎల్లో మీడియా సంస్థలు చంద్రబాబును మోస్తుంటాయి. ఆయనపై ఈగవాలనీయకుండా కాపుకాస్తుంటాయి. అయితే చంద్రబాబే వారికి దేవుడు.. తమతో పొత్తు పెట్టుకున్నా కూడా పవన్ కళ్యాణ్ కు అంతటి ప్రాధాన్యత గుర్తింపు ఇవ్వవు. చంద్రబాబు నెత్తిన పెట్టుకున్నా.. ఎల్లో మీడియా మాత్రం పవన్ కళ్యాణ్ పై ఆ ప్రేమను చూపించడం లేదు.

తాజాగా పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ తన పుష్ప2లో ఏదో సెటైర్లు వేశారని.. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారని.. చూపించారని కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా టీవీ5లో చర్చ పెట్టడం ఏమాత్రం జనసైనికులకు నచ్చడం లేదు.

తెరవేసి మరీ అల్లు అర్జున్ ‘ఏమీ ‘పీకే’లేరు’ అంటూ పవన్ కళ్యాణ్ ను అవమానించాడని టీవీ5 జర్నలిస్టు తెరపై అలా చూపించడాన్ని ఏ జనసైనికులు ఒప్పుకోవడం లేదు. అదేదో వైసీపీ వాళ్లు లేవనెత్తితే ఓ అర్థం ఉంటుంది. కానీ సొంత ఎల్లో పార్టీ చానెల్ ఇలా చేయడంతో దీన్ని జనసేన నేతలు ఎలా కవర్ చేయాలో తెలియక మళ్లా గుల్లాలు పడుతున్నారు.

ఇప్పటికైనా ఎల్లో మీడియా పవన్ ను పొగడకున్నా ఫర్వాలేదు కానీ.. ఇలా పవన్ పరువు తీసేలా అందరికీ తెలిసేలా చర్చలు మాత్రం పెట్టవద్దని జనసైనికులు కోరుతున్నారు.

వీడియో కోసం కింద లింక్ ను క్లిక్ చేయండి

తెర వేసి మరి ని పరువు తీసిన టీవీ 5 పై కేసు పెడతారా లేదా PawanKalyan