కేంద్రం నుంచి అతి తక్కువ ధరకే యూనిట్ రూ.2.49 పైసలకు విద్యుత్ కొన్న వైసీపీ సర్కార్ పై అభాండాలు వేసి అభూతకల్పనలతో వ్యతిరేక వార్తలు రాసిన ఎల్లో మీడియాకు సీఎం జగన్ షాకిచ్చారు. తమ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై అనవసర సందేహాలు కలిగిస్తూ కథనాలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు జగన్ శనివారం లీగల్ నోటీసులు జారీ చేశారు.
ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందమని, థర్డ్ పార్టీ మధ్య ఎలాంటి సంబంధం లేదని తమ క్లయింట్ మొదటి నుంచీ స్పష్టంచేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎస్ఇసి ఐఎస్టిఎస్ ఫీజులను మాఫీ చేసిందని ఆయన అన్నారు. ఒప్పంద పత్రాలు, సెక్రటరీ రాసిన లేఖ నకళ్లను అందజేస్తున్నా ఆంధ్రజ్యోతి పత్రికలు పట్టించుకోకుండా ఆధారాలు చూపకుండా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు రాస్తూ తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయన్నారు.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్ల మధ్య పారదర్శకమైన ఒప్పందంపై తప్పుడు కథనాలు రాసినందుకు వారు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో కోరారు, వాటిని మొదటి పేజీలో కూడా ప్రముఖంగా ప్రచురించాలని డిమాండ్ చేశారు.