కీలక సీనియర్ నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అయితే అందరికంటే ఎక్కువగా జగన్ ని తప్పు పట్టింది బాలినేనినే. కనీసం దగ్గరి బంధువు అని కూడా ఆయన విమర్శలను తగ్గించలేదు.. పార్టీ ఓటమిని చవిచూడడంతో బాలినేని పార్టీలో తనకున్న గౌరవాన్ని, పదవులను వదులుకున్నారు. ఆ తర్వాత జనసేనలో చేరితే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్సీ పదవి కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఆఫర్ నచ్చి వైసీపీని వీడి బాలినేని జనసేనలో చేరారు. ఎమ్మెల్సీతో మాట్లాడి వెళ్లిపోయారు. అదే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో జనసేన తరపున పోటీ చేయాలనుకున్నారు. ఎమ్మెల్సీగా గెలిచి ఏపీ కేబినెట్లో చేరాలనే ఆలోచనలో బాలినేని ఉన్నారు. అయితే సీఎం చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. బాలినేనికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదని భావించారు. చివరి నిమిషంలో నాగబాబు పేరు గల్లంతైంది. నాగబాబుతో పాటు పవన్ మనసు మార్చుకున్నాడు.
నిజానికి, నాగబాబు రాజ్యసభ ద్వారా పార్లమెంటులో అడుగుపెట్టాలనుకుంటున్నారు. అయితే తాను బాలినేనికి అవకాశం గురించి ఆలోచిస్తున్నానని చంద్రబాబుకు పవన్ చెప్పారు. అయితే వైసీపీ హయాంలో దూకుడుగా ప్రవర్తించిన కారణంగా బాలినేనిని జగన్కు చంద్రబాబు సమీప బంధువుగా భావించారు. కాగా బాలినేని చేరికపై ఒంగోలులో టీడీపీ నేతల నుంచి ప్రతిఘటన కూడా కనిపించింది. అందుకే బాబు ఈ టైంలో బాలినేని కంటే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో పవన్ పునరాలోచనలో పడ్డారు. నాగబాబులో కొత్త ఆశ చిగురించింది.
ఇప్పుడు ఇరువర్గాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చంద్రబాబు అధికారిక ప్రకటన చేశారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఏం చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది. వైసీపీలోకి వెళ్లలేడు. మళ్లి జనసేనలో కార్యకలాపాలు కొనసాగించలేడు. ఏం చేయాలనే బాధ నాగబాబును వెంటాడుతోంది.. మొత్తం మీద అష్టదిగ్బబంధనాల్లో బాలినేని నలిగిపోతున్నాడు. పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం.