మహాన్యూస్ ని రప్పాడించిన విజయసాయిరెడ్డి

vijayasaireddy

కరెక్ట్ మొగుడు తగిలితే ఏ సింహమైన బోనులో ఉంటుంది. లేదంటే గాండ్రిస్తుంది.. ఇప్పుడు పచ్చమీడియాకు విజయసాయిరెడ్డి అలానే తయారవుతున్నాడు.. గడగడ లాడిస్తున్నాడు. తాజాగా మహా టీవీకి, ఆ రిపోర్టర్ కు, మహా న్యూస్ ఎండీ ఇచ్చిపడేశాడు.

మహాన్యూస్ ను వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి చెడుగుడు ఆడేశాడు. అసలు మహా న్యూస్ ను ఒక చానెల్ కాదని.. దాన్ని ఏపీ జనాలు అసలు ఎవరూ పట్టించుకోరంటూ గాలి తీసేశాడు. ఆ చానెల్ ఒక బ్లాక్ మెయిల్ చానెల్ అని.. ’ ఆ మహా టీవీ జర్నలిస్ట్ ముందే విజయసాయిరెడ్డి ఆ చానెల్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేశాడు.

భీమిలి తీరంలో ఉన్న ల్యాండ్ మహా టీవీదా? నీదా? గవర్నమెంట్ ల్యాండ్ అన్నది నువ్వు చెప్పాలి. అది పట్టాభూమి రైతుల నుంచి మా బంధువులు కొంటే దాన్ని ప్రభుత్వ భూమి కబ్జా అంటూ ప్రసారం చేసిన మీ మహా న్యూస్ చానెల్ ఎండీ వంశీ మీద పరువు నష్టం దావా వేస్తానంటూ విజయసాయిరెడ్డి సూటిగా హెచ్చరించారు.

మా వియ్యంకులు కొన్నది ప్రైవేటు ల్యాండ్ అని.. టీడీపీ ఎంపీ భరత్ నుంచి భూమి కొన్నదని.. మసిపూసి మారేడు కాయ చేసేలా మహా న్యూస్ వార్తలు రాస్తే ఊరుకోమని.. ప్రభుత్వ భూమి అని తేలితే తాను మహా న్యూస్ వంశీకి రాసిస్తానంటూ విజయసాయిరెడ్డి సవాల్ చేశారు.

వీడియో కోసం క్లిక్ చేయండి