సినిమాల్లో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చేయడం చూశాం.. ఖుషీ సినిమాలో ఉత్తరాంధ్ర ‘అటు బస్సు ఇటు బస్సు’ అంటూ పాటపడి చిందేయడం చూశాం.. కానీ ఇప్పుడు నిజంగానే ఉత్తరాంధ్ర మన్యానికి వెళ్లి అక్కడ రోడ్లను అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ గిరిజనులతో కలిసిపోయాడు పవన్ .
ఏకంగా గిరిజనులతో కలిసి ధింసా అనే గిరిజన డ్యాన్స్ చేసి అలరించాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికే తనను ఓజీ అంటూ సినిమా పేర్లు, వివరాలు అడిగి ఇబ్బంది పెట్టవద్దన్న పవన్ కళ్యాణ్.. సాధారణ నేతగానే చూడాలని వారితో కలిసిపోయారు.
పవన్ గిరిజనులతో కలిసి చేసిన ధింసా డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి