జగన్ మావయ్య కోసం పిల్లలు చేసిన పని.. వీడియో వైరల్

ఆంధ్రుల అభిమాన నేత వైఎస్ జగన్.. ఆయన జన్మదినాన్ని ఈరోజు అంతా పండుగలా చేసుకుంటున్నారు. జగన్ అంటే ముఖ్యంగా చిన్న పిల్లలకు ప్రాణం.. జగన్ మావయ్యగా వారు అభిమానిస్తారు. ఎందుకంటే ‘అమ్మ ఒడి ’ అంటూ 15వేల ఆర్థికసాయాన్ని తల్లులకు ఇచ్చారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాలను నాడు నేడు అంటూ మార్చి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దాడు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ పథకాలు, పాఠశాలలను పడకేయించింది. అందుకే జగన్ లేని లోటు ప్రతీ ఇంట్లో కనపడుతోంది. ప్రతీ విద్యార్థికి సరైన మధ్యాహ్న భోజనం అందడం లేదు.

అందుకే జగన్ బర్త్ డేను ప్రతీ విద్యార్థి.. పిల్లాడు ఒక పండుగలా చేసుకుంటున్నాడు. జగన్ మావయ్య కోసం పిల్లలు భారీ కేకు తెచ్చి కట్ చేయించారు. ఆ కేకును, ఆహారాన్ని తీసుకొచ్చి ప్రతీ ప్యాకెట్ ను పిల్లలకు అందించి వైసీపీ అభిమానులు ఇదో పండుగలా చేశారు.

జగన్ మావయ్య కోసం పిల్లలు చేసిన ఈ పని ఇప్పుడు వైరల్ అవుతోంది. అందరూ జగన్ పై ప్రేమను చాటుతూ ఈరోజు ఘనంగా జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి