మనోడు అయితే కంచాల్లో.. పగోడు అయితే విస్తరాకుల్లో పెట్టడం కొందరు స్వార్థ రాజకీయ నాయకులకు అలవాటు. కానీ ఎన్నికల ముందర ఎన్నో నీతి సూక్తులు చెప్పిన పవన్ కళ్యాణ్ కూడా తన సహచర మంత్రి కోసం బిడ్డను కోల్పోయిన ఓ తల్లితో ఈ మాటలు అన్న వైనం విస్తుగొలుపుతోంది.
మన సామజిక వర్గం స్కూల్స్ .. మన సహచర మినిస్టర్ స్కూల్స్.. విద్య ఎప్పుడు అయితే వ్యాపారంగా మారిందో అప్పుడే విద్యాసంస్థలు మానవత్వం మరిచిపోతున్నాయి. విద్యార్థి సంఘాలు ఎప్పుడు అయితే అమ్ముడు పోవడం మొదలు పెట్టరో అప్పుడే విద్యార్థి సమస్యలు కూడా అమ్ముడుపోయ్యాయి.
తాజాగా నారాయణ స్కూలులో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ ను కలిశారు. దానిపై చర్యలు తీసుకోవాలని కోరారట.. ‘‘పవన్ క ళ్యాణ్ దగ్గర కి ఇలా మా పాప నారాయణ కాలేజీ లో చనిపోయింది చెప్తే.. చనిపోయిన మీ పాప ని ఎలాగో తీసుకొని రాలేము కదా అని అన్నాడట.. కనీసం పిటిషన్ అయినా చదవాలి గ ఇది ఒక తల్లి ఆవేదన చెందిన వీడియో ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
ఇదే పవన్ కళ్యాణ్ కార్పొరేట్ స్కూళ్ల దారుణాలపై ప్రతిపక్షంలో మాట్లాడిన వీడియోలను పెడుతూ నెటిజన్లు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు.
ఆ భగవంతుడు క్షమించినా కూడా ఖర్మ సిద్ధాంతం అనేది ఉంది ఖచ్చితంగా ఎవ్వరిని వదలదు ప్రతి ఒక్కరు ఖర్మ సిద్ధాంతం అనుభవించాలసిందే అంటూ నెటిజన్లు పవన్ తీరును ఎండగడుతున్నారు.