తిరుమలలో ఏదో జరిగిందని.. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారని పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చేసిన హంగామా అంతా ఇంతాకాదు. ఇప్పటికీ కూడా దాని మీద ఆధారాలు సేకరించలేదు. ఎవరినీ అరెస్ట్ చేసిన పాపాన పోలేదు. కేవలం రాజకీయ మైలేజ్ కోసం ఇలా ఆరోపించినట్టుగా అర్థమవుతోంది.
తిరుమలలో వేంకటేశ్వరుడి ప్రసాదానికి ఇలా అయితే గొంతు చించుకొన్న పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు ఏకంగా విశాఖలో అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని అందరిముందే సుత్తెలతో పగులకొట్టి మరీ పక్కనపెట్టేశారు.
2025 జనవరి 24న విశాఖలో ఘోరమైన అపచారం జరిగింది. విశాఖపట్నంలోని సీతమ్మధార రెవిన్యూ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని జీవీఎంసీ అధికారుల కూలగొట్టడం కలకలం రేపింది.
ఇది హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఇతర మతాల వారిపై కనీసం ప్రహరీ గోడ కూడా కూలగొట్టడానికి వెళ్లని మున్సిపల్ అధికారులు.. హిందూ దేవుళ్ల విషయంలో ఇంతటి ఘోరమైన అపచారానికి పూనుకోవడాన్ని ఎవరూ జీర్ణించుకోవడం లేదు.
ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ స్పందించి తిరుమలలో లాగానే మెట్లు కడిగి సనాతన దీక్ష చేపట్టి పాప పరిహారం చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తన ప్రభుత్వంలో జరిగిన ఈ ఘోరానికి ఎలాంటి చర్యలు తీసుకుంటాడోనని నిలదీస్తున్నారు. మరి ఇది విశాఖలోనే జరిగిందా? నెటిజన్లు కావాలనే వీడియో రిలీజ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.