మాజీ మంత్రి నిమ్మల రామానాయుడు మళ్లీ అడ్డంగా దొరికారు. ఈసారి ఆయన ప్రజలకు ఎన్నికల ముందర నీకు రూ.15వేలు అంటూ వంచించిన మరిన్ని వీడియోలు తాజాగా వెలుగుచూస్తున్నాయి.. సాధారణ ప్రజలనే కాదు వలంటీర్లను మోసం చేశాడు. మీకు జీతం పెంచుతామని.. పూతరేకులు తీసుకొచ్చి మా నోరు తీపి చేయాలని మోసం చేసిన వీడియోలు తాజాగా వెలగుచూశాయి.
ఏపీ రాజకీయ వర్గాల్లో ఈరోజు తాజాగా ఒక్క వీడియో సంచలనం రేపుతోంది. “మీరు మా పార్టీకి ఓటేస్తే రూ.15,000 మీ ఖాతాలోకి వచ్చి పడతాయి! వలంటీర్లు సహకరిస్తే మీకు రూ.10వేలతోపాటు జీతం పెంచుతాను” అంటూ మాజీ మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్నికల సమయంలో చెప్పిన మాటల వీడియోలు బయటకొచ్చాయి.
ఎన్నికల ప్రచారం సమయంలో రామానాయుడు చేసిన హామీలకు, ఇప్పుడు బయటకు వచ్చిన వీడియోలకు భిన్నమైన వాస్తవం కనిపిస్తోంది. “మీకు జీతం పెంచుతాం!” అని వలంటీర్లకు మాట ఇచ్చిన ఆయన, ఇప్పటి వరకు ఆ మాటను నిలబెట్టలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలకు పెద్ద పెద్ద హామీలు ఇచ్చి, తరువాత వాటిని అమలు చేయకపోవడం రాజకీయాల్లో కొత్త కాదు. కానీ, సోషల్ మీడియా కాలంలో ప్రజలకు మరిచిపోనివ్వడం సాధ్యమేనా? ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ కావడంతో, రామానాయుడు తప్పించుకునే మార్గం ఏదీ కనిపించడం లేదు.
ఇటీవల, రామానాయుడు పాలకొల్లు మండలంలోని కొన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, ఆయన తిరిగి జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. కానీ, ఇదే సందర్భంలో ప్రజలు – “మీరు మా హామీల గురించి మర్చిపోయారా?” అంటూ ప్రశ్నిస్తుండడం గమనార్హం.
ఎన్నికల హామీలు ఇచ్చి నిలబెట్టని రాజకీయ నేతల గురించి ప్రజలు ఎంతకాలం మౌనం పాటించాలి? ఈ వైరల్ వీడియోల నేపథ్యంలో, రామానాయుడు తన హామీల గురించి ఏమైనా స్పందిస్తారా? లేక “ఆ వీడియోలు వక్రీకరించబడ్డాయి” అనే పాత మాటలతో తప్పించుకోవాలని చూస్తారా? అన్నది వేచిచూడాలి.
ఇలాంటి వీడియోలతో కూటమి ఎమ్మెల్యేల మోసం బయటపడుతోంది. ప్రజలకు ఈ విషయంలో న్యాయమైన సమాధానం రాకుంటే, రాబోయే రోజుల్లో కూటమిలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కడం ఖాయం!