చంద్రబాబు గురించి ఏబీఎన్ వెంకటకృష్ణతో చెప్పుకొని బాధపడ్డ రఘురామకృష్ణంరాజు

రఘురామకృష్ణంరాజు.. వైసీపీ ఎంపీగా గెలిచి.. సొంత పార్టీ అధినేత వైఎస్ జగన్ మీదనే రెబల్ గా మారి అసమ్మతి రాజేశారు. జగన్ పై ఇంటా బయటా చంద్రబాబు ప్రోద్బలంతో రచ్చ చేశారు. రఘురామ రాజు ఎక్కడున్నా రాజే అన్నట్టు.. జగన్ చేతిలో అరెస్ట్ అయ్యి జైలుపాలయ్యి కూడా బుద్దితెచ్చుకోలేదు.

అనంతరం వైసీపీ హయాంలో తనను లేపిన చంద్రబాబుతో దోస్తి కట్టి ఇప్పుడు టీడీపీ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ స్పీకర్ పదవి ని బలవంతంగా చంద్రబాబుతో పోరాడి మరీ సాధించుకున్నారు.

ఇప్పుడు టీడీపీలో హక్కుల కోసం పోరాడుతున్నారు. తనను అరెస్ట్ చేసి జైల్లో చావబాదిన వారిపై ప్రతీకారంతో రగిలిపోతున్నారు. వారి ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు.. సస్పెండ్ చేయడం లేదంటూ తాజాగా రఘురామరాజు సొంత చంద్రబాబు తీరుపై స్వయంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ లో వాపోయాడు.

ఏబీఎన్ వెంకటకృష్ణ అసలే కోడిగుడ్డు మీద ఈకలు పీకే టైపు. ఆయన చర్చలో రఘురామ పాల్గొని ‘కాదంబరి కేసులో ముగ్గురు ఐఏఎస్ లను ఆగమేఘాల మీద సస్పెండ్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. తనను జైల్లో కుల్లబొడిచిన కేసులో ఇంతవరకూ ఏ పోలీస్ పై చర్యలు తీసుకోలేదని తన ఆవేదనతో కూడిన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. చూస్తుంటే.. వైసీపీలో రెబల్ రాజుగా మారిన రఘురామ టీడీపీలోనూ అదే లాగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి