Top Stories

ఏబీఎన్ వెంకటకృష్ణ బాధ అంతా ఇంతా కాదు!

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ వెంకటకృష్ణ తాజాగా చానెల్ లో చర్చ పెట్టి తన ఆవేదనను.. అసహాయతను వ్యక్తం చేశారు. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా వ్యవహారశైలి, టీడీపీ , జనసేన సోషల్ మీడియా వైఫల్యంపై ఆయన గంభీరంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యల ప్రకారం, వైసీపీకి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా తన నేతలను రక్షించేందుకు ఎంతగా చురుగ్గా ఉంటుందో, అదే విధంగా ప్రత్యర్థులపై విరుచుకుపడుతోందని అన్నారు.

వెంకటకృష్ణ మాట్లాడుతూ.. టీడీపీ , జనసేన సోషల్ మీడియా తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు వచ్చిపడుతున్నా కూడా, జనసేన సోషల్ మీడియా ప్రతిస్పందన లేకుండా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇదే తరహాలో టీడీపీని కూడా తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నా, టీడీపీకి అనుకూలమైన సోషల్ మీడియా నిశ్శబ్దంగా ఉంటోందని ఆరోపించారు.

అదే సమయంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా వ్యవస్థ పూర్తిగా దూకుడుగా ఉందని వెంకటకృష్ణ తెలిపారు. ముఖ్యంగా సీఎం జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే, వెంటనే సోషల్ మీడియా అతనిని రక్షించేందుకు ముందుకు వచ్చి, విమర్శకులను తీవ్రమైన స్థాయిలో ట్రోల్ చేస్తోందని ఆయన అన్నారు. కిరణ్ రాయల్ జగన్ ను తిడితే ఊరుకోలేదని.. ఇప్పుడు ఆయన మహిళతో దొరికితే ఎంతగా ట్రోల్ చేసి ఆయన పరువు తీసిందో అర్థమవుతోందన్నారు. ఈ దెబ్బకు పవన్ కళ్యాణ్ ఏకంగా నోటీసులు ఇచ్చారంటే వైసీపీ సోషల్ మీడియా బలం ఏమేరకు ఉందో అర్థమవుతోందన్నారు.

ఈ పరిస్థితిని గమనిస్తే, రాజకీయ పార్టీల సోషల్ మీడియా విభాగాలు సమతుల్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది. అభిప్రాయ స్వేచ్ఛను గౌరవిస్తూ, రాజకీయ విమర్శలకు సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలను గెలిచాక ఆ రెండు పార్టీలు పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని అర్థమవుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

Topics

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

‘అగ్ని పరీక్ష’ వెనుక ఉన్న అసలు కారణం ఇదే!

  టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలతో...

పబ్లిక్ గా దువ్వాడ-దివ్వెల రోమాన్స్.. మీ సరసం సల్లగుండ!

  రాజకీయాల్లో ఒకప్పుడు వైసీపీకి దగ్గరగా ఉన్న బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్...

రాజన్న మళ్లీ పుట్టవా?

2009 సెప్టెంబర్ 2న ఆకాశం చీకటిగా మారిన రోజు... తెలుగు రాష్ట్రాల...

Related Articles

Popular Categories