ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అప్పులు పెరిగిపోయాయని, వాటికి వడ్డీలు కట్టాలని, అప్పులు తిరిగి చెల్లించకపోతే కొత్తగా ఎవరు అప్పులు ఇవ్వరని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కారణంగా ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదని, తక్షణం ఏపీ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయలేమని ఆయన వెల్లడించారు.
“సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని ఉన్నా, రాష్ట్రం నడిపేందుకు అవసరమైన నిధులు లేవు” అని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి కృషి చేస్తున్నామని, అయితే ఇప్పట్లో సంక్షేమ పథకాలు అమలు చేయడం కష్టమని స్పష్టం చేశారు.సంపద సృష్టిస్తాను. ప్రజలకు పంచుతానన్న పెద్దమనిషి ఇప్పుడు ఏపీ ప్రజలకు షాకిస్తూ చేతులెత్తేసాడని ప్రజలు మండిపడుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో భారీగా అప్పులు తీసుకున్న రాష్ట్రానికి, వాటిపై వడ్డీలు కట్టడం కూడా కష్టంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయితే ప్రజలు సహనం పాటించాలని సీఎం చంద్రబాబు కోరారు.
ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం తిరిగి సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రజలకు సంక్షేమ పథకాల్లో ఆలస్యం జరుగుతుందా? రాష్ట్రం ఆర్థికంగా కోలుకుని మళ్లీ సంక్షేమ పథకాలను పునఃప్రారంభించగలదా? అన్నది సమయానుసారం తెలుస్తుంది.
మొత్తంగా బాబు గారు మరోసారి ఏపీ ప్రజలను గొర్రెలను చేసి మోసం చేశాడంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
చేతులెత్తేసిన చంద్రబాబు మాట్లాడిన మరో షాకింగ్ వీడియోను ఇప్పుడు మీరు చూడొచ్చు.