Top Stories

చంద్రబాబును ర్యాగింగ్ చేసిన జగన్

గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులను పరామర్శించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు “సూపర్ సిక్స్, సూపర్ సెవెన్” అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి రైతుల దుస్థితిని చూస్తుంటే రాష్ట్రానికి అరిష్టం వచ్చిందేనని ఆయన అన్నారు.

జగన్ డిమాండ్ చేస్తూ, చంద్రబాబు వెంటనే గుంటూరు మార్కెట్ యార్డుకు వెళ్లి రైతులను కలవాలి అని కోరారు. రైతులకు బాసటగా నిలిచేలా ప్రభుత్వమే మిర్చిని కొనుగోలు చేయాలని సూచించారు. బుధవారం జరిగిన తన పర్యటన అనంతరం, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సుదీర్ఘ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులకు కష్టాలు, నష్టాలే మిగిలాయి అని జగన్ ఆరోపించారు. పంటలకు మద్దతు ధర కల్పించడమే అక్కర్లేదు.. కనీసం కొనుగోలు చేయడానికి కూడా ఎవరూ లేరు అని విమర్శించారు. ధాన్యం రైతుల పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు మిర్చి రైతులు కూడా అదే విధంగా ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు.

తాను అధికారంలో ఉన్న సమయంలో మిర్చి ధర క్వింటాలకు 21 నుంచి 27 వేల రూపాయల వరకు ఉండేదని గుర్తుచేశారు. అయితే, ఇప్పుడేమో అది 11 వేలకు పడిపోవడం దారుణం అని మండిపడ్డారు. గుంటూరు మార్కెట్ యార్డ్ సీఎంఓకు అతి సమీపంలో ఉన్నా, చంద్రబాబు అక్కడి రైతుల బాధలను పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

ఎన్నికల సమయంలో చంద్రబాబు “సూపర్ సిక్స్, సూపర్ సెవెన్” అంటూ రైతులకు హామీలు ఇచ్చి, 20 వేల రూపాయలు ఇస్తామని నమ్మబలికారు అని జగన్ ఆరోపించారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా సహా పలు సంక్షేమ పథకాలను రద్దు చేశారని ఆరోపించారు. “పలావూ లేదు, బిర్యానీ లేదు.. రైతు భరోసా కూడా నిలిపివేశారు” అంటూ వ్యంగ్యంగా విమర్శించారు.

చంద్రబాబు ఇప్పటికైనా కళ్లుతెరిచి రైతుల సమస్యలను గుర్తించాలి అని డిమాండ్ చేసిన జగన్, “రైతే రాజన్న” అనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలని” స్పష్టం చేశారు.

Trending today

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే,...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

Topics

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే,...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

Related Articles

Popular Categories