Top Stories

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తి, మహా వంశీ సైలెన్స్

జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేకపోతున్న ఎల్లో మీడియా జర్నలిస్టులు.. తమ మీడియాలో జగన్ ప్రజాదరణ వీడియోలనే ప్రదర్శించకుండా కుట్ర చేస్తున్నారని అర్థమవుతోంది.. జగన్ మేనియాకు ఎల్లో మీడియా వణికిపోతోంది. చంద్రబాబు, పవన్, లోకేష్ లను మించిన క్రేజ్ జగన్ కు వస్తోందని టీడీపీ, జనసేన భయపడుతోందని అర్థమవుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాదరణ రోజురోజుకు పెరిగిపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆయన నాయకత్వాన్ని విశ్వసిస్తూ, మద్దతుగా భారీ సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు. ఈ స్థాయిలో ప్రజాదరణ పెరగడం చూసి, అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన శ్రేణులు కంగారు పడుతున్నాయి. ముఖ్యంగా ఎల్లో మీడియా ఈ నిన్నటి నుండి జగన్ క్రేజ్ ను దాచిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఎప్పటి నుంచో వైఎస్ జగన్‌పై విష ప్రచారం చేయడంలో దిట్ట అయిన ఎల్లో మీడియా, ఇప్పుడు మరింత కుళ్లు కుంటోంది. ముఖ్యంగా జగన్ పట్ల పెరుగుతున్న ప్రజాస్వామ్యమైన అభిమానాన్ని ప్రజల కళ్లకు కట్టకుండా తమ ఛానళ్లలో ప్రదర్శించకుండా ఉండటానికి కుట్రలు పన్నుతోంది. ప్రజల్లో పెరిగిపోతున్న మద్దతును తట్టుకోలేకపోతున్న ఎల్లో మీడియా, చంద్రబాబు , జనసేన అనుకూల మీడియా సంస్థలు జగన్ ప్రజాదరణకు సంబంధించిన వీడియోలను కవరేజ్ చేయకుండా బహిష్కరిస్తున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ పట్ల ప్రజల్లో ఉన్న క్రేజ్‌ను చూసి, టీడీపీ , జనసేన నేతలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. జగన్ కు వస్తున్న అపారమైన ప్రజాదరణ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లకు కూడా రాని స్థాయిలో ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో, రాజకీయంగా నిలబడలేకపోతున్న విపక్షాలు తమ అనుకూల మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేయిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజలు ఎవరి వెంట ఉంటారు, ఎవరికి మద్దతు ఇస్తారనేది వారికి నచ్చిన వ్యక్తి పని తీరు మీద ఆధారపడి ఉంటుంది. వైఎస్ జగన్ ప్రజలకు సీఎంగా ఉండగా అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, పాలనలో పారదర్శకత ప్రజలకు నచ్చడంతో, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణను ఇప్పుడు ఇవేవీ చేయకుండా ఖజానా ఖాళీ అంటూ తప్పించుకుంటున్న కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అబద్ధపు కథనాలు రాసినా, ప్రజలు నిజాన్ని అర్థం చేసుకుంటారు. జగన్ పట్ల ప్రజలు చూపిస్తున్న విశ్వాసం, రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories