ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లో కలిసిపోయి, వారి సమస్యలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రజల నుంచి కొంతదూరంగా ఉంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ఒక సందర్భంలో ఓ తండ్రి తన చిన్నపాపను పవన్ కళ్యాణ్కు అందించగా, ఆయన అంగీకరించకుండా వద్దు అంటూ పాపను దూరం పెట్టాడు. ఇలా ప్రవర్తించడం సరికాదని కొందరు విమర్శిస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఆయనపై విమర్శలు పెరిగాయి. ప్రజల ప్రేమను స్వీకరించడంలో పవన్ కొంత వెనుకబడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అదే నిన్న జగన్ తన కోసం తపన పడుతున్న ఓ పాపను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టి ఆప్యాయంగా సెల్ఫీ దిగాడు. జగన్ తన మంచి మనసును, ప్రేమను చాటుకున్నాడు. ఈ ఘటన ప్రజల్లో జగన్ గొప్ప మనసును, ప్రేమను చూపించిందని ఆయన అనుచరులు ప్రశంసించారు. జగన్ ప్రజలతో మమేకమవుతూ, వారితో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ రెండు ఘటనలు రాజకీయ నాయకుల ప్రజలతో ఉండే అనుబంధాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రజా నాయకుడు ప్రజల మధ్య ఉండాలని, వారి ప్రేమను గౌరవించాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన హుందాతనంతో ప్రజలకు దూరమవుతున్నారా? లేదా ఇది కేవలం విమర్శకుల ప్రచారమా? అనే ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.