ఒకరేమో దిగ్గజ జర్నలిస్ట్ గా చెప్పుకుంటూ చంద్రబాబుకు భజన చేసే న్యూస్ యాంకర్. ఇంకొకరు ఏమో గిచ్చి కయ్యం పెట్టుకొని వివాదాస్పద రాజకీయ నాయకుడు.. ఈ ఇద్దరూ కలిస్తే దబిడ దిబిడే.. ఈ ఇద్దరూ నిన్న రాత్రి ఏబీఎన్ చానెల్ లో నిర్వహించిన చర్చా వేదికలో కలిశారు వారే ఏబీఎన్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ, వివాదాస్పద ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు..
నిన్న జగన్ గుంటూరులో వల్లభనేని వంశీని జైల్లో పరామర్శించేందుకు వచ్చాడు. ఈ సందర్భంగా అక్కడ జగన్ కోసం పరితపించిన ఓ బాలికను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ముద్దాడాడు. సెల్ఫీ ఇచ్చాడు. ఆ బాలిక ఆనందభాష్పాలతో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ అయ్యింది. అందరి గుండెలను తాకింది.. ఏమోషనల్ వీడియో అందరినీ కంటతడి పెట్టించింది.
అయితే ఆ చిన్నారి ప్రేమకు కూడా వక్రభాష్యం చెప్పారు ఈ ఇద్దరు ప్రముఖులు.. ‘బాలనటిని తీసుకొచ్చి అద్భుతంగా జగన్ ముందర నటింపచేశారట.. రూ.15వేలు ఇచ్చి ఆమెతో ఏడిపించారని.. జగన్ కోసం పీఆర్ డ్రామాలు ఆడారని..ఆ ప్రయత్నం నిజంగా గ్రేట్.. ప్రజలు తెలివైనోళ్లు నమ్మరు’ అంటూ రఘురామ దారుణ కామెంట్స్ చేశారు.
దీనికి ఏబీఎన్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ కూడా ‘జగన్ కు, పీఆర్ టీంకు, మీడియాకు ఇది అలవాటే.. కెమెరాలన్నీ చుట్టూ పెట్టుకొని ప్రతీ మూమెంట్ ను ఒడిసిపట్టి జనంలోకి వదిలారని..ఇదంతా పొలిటికల్ స్టంట్’ అంటూ వెంకటకృష్ణ నోరుపారేసుకున్న వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయి వ్యక్తి ఒక చిన్న పిల్లని ఇలా అనడం ఎంతవరకు సమంజసం అని రఘురామ తీరుపై నెటిజన్లు కడిగేశారు. ఇక వెంకటకృష్ణను అయితే నీకు భగవంతుడు సిగ్గు అనేది పెట్టలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ మారరు అంటూ తిట్టిపోస్తున్నారు.