Top Stories

రెడ్ బుక్ రాజ్యాంగం.. వైసీపీలో నెక్ట్స్ టార్గెట్ ఎవరు?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం హాట్ టాపిక్ – నెక్స్ట్ టార్గెట్ ఎవరు? కొడాలి నానా? ఆర్.కే. రోజానా? లేక మరొకరా? రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దూకుడుగా వ్యవహరించిన నేతలు ఒక్కొక్కరుగా వివిధ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. తాజా ఉదాహరణ వల్లభనేని వంశీ అరెస్ట్. ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తుండగా, కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. గన్నవరం నియోజకవర్గ కేంద్రంగా భూకబ్జాలు, బెదిరింపులపై ఆయనపై అనేక ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి – రాష్ట్రంలో రెడ్ బుక్ సంస్కృతి అమలవుతోందని. ఇప్పుడు కొడాలి నాని నెక్స్ట్ టార్గెట్ అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వం రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. అనుకున్నట్లుగా కొడాలి నానిని కాకుండా అనంతపురం వైపు దృష్టి మళ్లినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. పోలీసుల దర్యాప్తు కూడా దీనిని బలపరుస్తోంది.

గోరంట్ల మాధవ్ – చరిత్ర, ఎదుగు, పతనం

2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు గోరంట్ల మాధవ్. పోలీస్ శాఖలో సీఐగా పనిచేస్తున్న ఆయన, జేసీ దివాకర్ రెడ్డిపై తిరుగుబాటు చేసి సంచలనం సృష్టించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో కూడా పోలీస్ పవర్‌ను ప్రయోగించి తనదైన ముద్ర వేశారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందిన ఆయన, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి, హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు.

అయితే, రాజకీయాల్లో ఏ దూకుడుతో అడుగుపెట్టారో, అదే దూకుడు ఇప్పుడు ఆయనకు సమస్యగా మారింది. ఓ న్యూడ్ వీడియో వివాదంతో మాధవ్ తన రాజకీయ ప్రతిష్ఠను దిగజార్చుకున్నారు. ఆ ఘటన తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర అనుమానాలు నెలకొన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు మద్దతుగా నిలబడలేకపోయింది. ఈ కారణంగా 2024 ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్ దక్కలేదు.

కూటమి అధికారంలోకి రాగానే కొత్త సమస్యలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోరంట్ల మాధవ్ పై ఒత్తిడి పెరిగింది. గతంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తాజాగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు, మాధవ్ కు నోటీసులు జారీ చేశారు. మార్చి 5న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు.

ఇప్పటివరకు వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళిల సరసన చేరిన మాధవ్, ఇప్పుడు రెడ్ బుక్ లో నెక్స్ట్ టార్గెట్ గా నిలిచినట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. మరి, ఆయన భవిష్యత్తు ఏ విధంగా మలుపుతిప్పుకుంటుందో వేచి చూడాలి.

 

Trending today

బిగ్ బ్రేకింగ్ : జగన్ పాదయాత్ర.. ఎప్పుడంటే?

2019 ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన...

ఏబీఎన్ వెంకటకృష్ణ ఓపెన్ అయిపోయాడు..

రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం ఇప్పుడు మరింత ఆసక్తికర మలుపు...

మొన్న బాబు.. నేడు పవన్.. ఇదీ ఘోరం..

రాష్ట్రంలో కల్తీ మాఫియా మరోసారి విరుచుకుపడుతోంది. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబు...

కేశినేని చిన్ని ఖేల్ ఖతం

తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) రాజకీయంగా క్లిష్ట...

వైసీపీకి 40 శాతం ఓట్లు వెనుక వాళ్లే

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాలంటీర్ల వ్యవస్థ ఒకప్పుడు ప్రజలతో ప్రభుత్వాన్ని కలిపిన బలమైన...

Topics

బిగ్ బ్రేకింగ్ : జగన్ పాదయాత్ర.. ఎప్పుడంటే?

2019 ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన...

ఏబీఎన్ వెంకటకృష్ణ ఓపెన్ అయిపోయాడు..

రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం ఇప్పుడు మరింత ఆసక్తికర మలుపు...

మొన్న బాబు.. నేడు పవన్.. ఇదీ ఘోరం..

రాష్ట్రంలో కల్తీ మాఫియా మరోసారి విరుచుకుపడుతోంది. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబు...

కేశినేని చిన్ని ఖేల్ ఖతం

తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) రాజకీయంగా క్లిష్ట...

వైసీపీకి 40 శాతం ఓట్లు వెనుక వాళ్లే

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాలంటీర్ల వ్యవస్థ ఒకప్పుడు ప్రజలతో ప్రభుత్వాన్ని కలిపిన బలమైన...

లోకేష్-తిలక్ వర్మ ఒక్కటేనట

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ.. మీడియా ఎలివేషన్లు కూడా హీట్ పెంచుతున్నాయి....

ఫోన్ ట్యాప్.. 10 కోట్లు డిమాండ్.. TV5 మూర్తిపై కేసు నమోదు

ప్రముఖ జర్నలిస్టు టీవీ5 మూర్తిపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు....

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏపీ పార్టీలు..

తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు...

Related Articles

Popular Categories