Top Stories

భయపడిన లోకేష్… లైవ్ నిలిపివేతపై వివాదం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. శాసనమండలిలో YSRCP ఎమ్మెల్సీలు రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల మంత్రి నారా లోకేష్‌ను కఠినంగా ప్రశ్నించగా, ఆయన సమాధానాల్లో తడబడినట్లు అనిపించింది. ఈ నేపథ్యంలో, సమాచార శాఖ హఠాత్తుగా మండలి లైవ్ ప్రసారాలను నిలిపివేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

YSRCP ఎమ్మెల్సీలు రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై లోకేష్‌ను ప్రశ్నించగా, ఆయన కొన్ని ప్రశ్నలకు తడబడినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆయన నిర్భందానికి గురైనట్లు అనిపించిందని ప్రతిపక్షం విమర్శిస్తోంది. దీంతో, అకస్మాత్తుగా లైవ్ ప్రసారాలను నిలిపివేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజలకు శాసనమండలి సమావేశాలను ప్రత్యక్షంగా అందించాల్సిన సమాచార శాఖ లైవ్ ప్రసారాలను నిలిపివేయడం రాజకీయ వివాదానికి దారితీసింది. “లోకేష్ ఒడిదుడుకులకు గురయ్యాడా?” “ప్రభుత్వం అసలు నిజాలను దాచిపెట్టాలని చూస్తుందా?” అంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

YSRCP నేతలు ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. “ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఉండాలి. కానీ, అధికార పార్టీ తమకు ఇబ్బందికరమైన అంశాలను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది” అంటూ మండిపడ్డారు.

అటు, టీడీపీ వర్గాలు ఈ వ్యవహారంపై మౌనం పాటించాయి. లైవ్ ప్రసారాల నిలిపివేతపై అధికార వర్గాల నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇప్పటికే ఈ వ్యవహారం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. YSRCP, టీడీపీ మద్దతుదారులు పరస్పరం ఆరోపణలు, ప్రతి ఆరోపణలు చేసుకుంటున్నారు. లైవ్ ప్రసారాలను నిలిపివేయడంపై అసలు కారణం ఏమిటో ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

ఈ పరిణామాలు మరింత రాజకీయ దుమారాన్ని రేపే సూచనలున్నాయి. మండలి లైవ్ ప్రసారాలు తిరిగి ప్రారంభమవుతాయా? లేక ఇంకా కొంతకాలం నిలిపివేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Trending today

కూటమిలో పొత్తుకు ప్రమాదం.. పసిగట్టిన పవన్

జనసేన నాయకత్వం కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా...

ఏబీఎన్ ఆర్కేను జైలుకు పంపుతాం

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ (ఆర్కే)పై బీఆర్ఎస్ నాయకులు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు....

జగన్ వస్తున్నాడంటే ఆ మాత్రం ఉండాలి

ఈనెల 9వ తారీఖున చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాలెం మండలంలోని...

టీడీపీలో టెన్షన్!

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్దపరిమి గ్రామ రైతులు ల్యాండ్ పూలింగ్...

లోకేష్ మనసులో మాట

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు...

Topics

కూటమిలో పొత్తుకు ప్రమాదం.. పసిగట్టిన పవన్

జనసేన నాయకత్వం కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా...

ఏబీఎన్ ఆర్కేను జైలుకు పంపుతాం

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ (ఆర్కే)పై బీఆర్ఎస్ నాయకులు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు....

జగన్ వస్తున్నాడంటే ఆ మాత్రం ఉండాలి

ఈనెల 9వ తారీఖున చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాలెం మండలంలోని...

టీడీపీలో టెన్షన్!

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్దపరిమి గ్రామ రైతులు ల్యాండ్ పూలింగ్...

లోకేష్ మనసులో మాట

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు...

కేంద్రానికి బాబుపై ఐఏఎస్, ఐపీఎస్ ల ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొలువుదీరిన టీడీపీ కూటమి ప్రభుత్వంపై కొందరు ఐఏఎస్, ఐపీఎస్...

భయపడ్డ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

'కొత్త పలుకు'లో బీఆర్ఎస్ తెలంగాణ జాగీరా అంటూ ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ రాసిన...

బాబు రిటర్న్ గిఫ్ట్

రాష్ట్రంలో రేషన్ పంపిణీ తీరుపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది....

Related Articles

Popular Categories