Top Stories

రామానాయుడు కుటుంబానికి కూటమి ప్రభుత్వం షాక్

ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. విశాఖలో ఉన్న ప్రసిద్ధ రామానాయుడు స్టూడియోను సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రుషికొండ బీచ్ సమీపంలో ఉన్న సుమారు 15 ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వానికి చెందినదిగా ప్రకటిస్తూ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ భూములు అప్పట్లో, 1999లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో, సినీ దిగ్గజం దగ్గుబాటి రామానాయుడు అభ్యర్థన మేరకు స్టూడియో నిర్మాణం కోసం కేటాయించబడ్డాయి. ఆ సమయంలో రామానాయుడు బాపట్ల నుంచి టీడీపీ ఎంపీగా సేవలందిస్తున్నారు. స్టూడియో నిర్మాణం కోసం కేటాయించిన భూమిలో కొంత భాగం మాత్రమే వినియోగించబడగా, మిగిలిన 15 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి.

వీటిపై ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఈ అంశాన్ని ప్రస్తావించగా, ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు చేపట్టింది. స్టూడియో భూములపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని, కొన్ని రాజకీయ నాయకులు వాటిని స్వాధీనం చేసుకొని విల్లాలు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

అసలే గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనూ ఈ భూములను వెనక్కి తీసుకునే ప్రయత్నాలు జరిగినట్టు సమాచారం. కానీ అప్పట్లో ప్రభుత్వం తరపున కొందరు నేతలు స్టూడియో యాజమాన్యాన్ని బెదిరించి భూమిని స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు వెలువడ్డాయి. 2022లో రామానాయుడు స్టూడియో యాజమాన్యం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC)కు గృహ నిర్మాణ అవసరాల నిమిత్తం వినతి పత్రం సమర్పించగా, అనుమతులు కూడా పొందారు.

తాజాగా కూటమి ప్రభుత్వం ఆ భూములపై చర్యలకు దిగడం రాజకీయంగా దుమారం రేపుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉండటమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. రామానాయుడు కుటుంబం టీడీపీకి అనుకూలంగా ఉండటం తెలిసిన సంగతే. అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంలో వారి అభిప్రాయాన్ని తీసుకున్నట్టు సమాచారం.

ఈ పరిణామాలతో దగ్గుబాటి కుటుంబానికి – ముఖ్యంగా రామానాయుడు స్టూడియో యాజమాన్యానికి – ఇది ఓ పెద్ద షాక్‌గా భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories