Top Stories

చంద్రబాబుకు కరెంట్ అమ్ముతున్న రాధాకృష్ణ!

ఇప్పుడు ఇది సూరవరం ప్రతాపరెడ్డి రోజులు కాదు. రామ్ నాథ్ గోయెంకా రోజులు అయితే అసలే కాదు. పత్రికా రంగం ఇక ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభం అనే భావనకీ దూరమవుతోంది. ప్రజల సమస్యలు మాత్రమే వెలికి తీసే పత్రికలు గోల్కొండ గారిది లాంటి నిజాయితీతో పనిచేసే రోజులూ కావు.

ఈ రోజుల్లో పత్రిక యజమానులకు రాజకీయ రంగులు ఉంటాయి. రాజకీయ సంబంధాలు, వాసనలు ఉంటాయి. రాజకీయ నాయకులతో మమేకం అవ్వడం సహజం. రాజకీయ పార్టీకి డప్పు కొట్టే అవసరం కూడా ఉంటుంది. పత్రికలు నడుపడమంటే ఒక వ్యాపారం. ఆ వ్యాపారంలో పనిచేసే వారు ఉద్యోగులు, వారికి జీతాలు, భవిష్యనిధులు, జీత పెంపులు ఇవ్వాలి. ఇవన్నీ సాధించాలంటే యాజమాన్యాలు ‘న్యూట్రల్‌’గా ఉండడం సాధ్యం కాదు. అలా ఉంటే ఎక్కువగా లాభాలు రావు. అందుకే యాజమాన్యాలు ఎంచుకున్న రంగులో ఆడతాయి. కొందరు యజమానులు పార్టీ కార్యకర్తలకంటే ఎక్కువగా పార్టీకి ప్రచారం చేస్తారు. ప్రతి పత్రిక యాజమాన్యం వెరైటీ.

తెలుగు రాష్ట్రాల్లో టిడిపి అనుకూల మీడియాగా ప్రసిద్ధిగాంచిన పత్రికల్లో ఆంధ్రజ్యోతి ఒకటి. ఇది ఎవరి ఆరోపణల వల్ల వచ్చిన పేరు కాదు. రెండు శాసనసభల్లోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ పత్రికలని బహిరంగంగానే ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి, టీవీ5లపై నేరుగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో ఆంధ్రజ్యోతి తెరచాపగా టిడిపికి మద్దతు ఇచ్చిన పత్రికగా నిలిచింది. జగన్ ప్రభుత్వాన్ని ఉతుక్కుపోయినట్లు ఉతికేసింది.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడుకు టిటిడి చైర్మన్ పదవి దక్కింది. కాస్త ఆలస్యంగా అయినా ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణ కూడా లైన్‌లోకి వచ్చారు. అయితే ఆయనకు నామినేటెడ్ పోస్ట్ రాలేదు, కానీ మరో రకంగా లాభం లభించింది. ఆయనకు చెందిన యాక్టివ్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పవర్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదిర్చుకుంది.

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆ ఒప్పందానికి పచ్చజెండా ఊపింది. రాధాకృష్ణకు ఎన్టీఆర్ జిల్లా బుడమేరు డివిజన్ కెనాల్‌పై 1.54 మెగావాట్ల మినీ జల విద్యుత్ కేంద్రం ఉంది. ఈ కేంద్రం నుంచి వచ్చే 15 సంవత్సరాల పాటు విద్యుత్‌ను ఏపీ సీపిడిసిఎల్ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. 2025 జూన్ 1 నుంచి యూనిట్‌కు ₹2.50 చెల్లిస్తారు. ఈ టారీఫ్ విషయంలో ఎలాంటి ప్రణాళిక లేదని, అవసరానుసారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

 

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories