Top Stories

జగన్ మళ్లీ ఆళ్లపై దృష్టి: అమరావతిలో ఆస్త్రం సిద్ధం?

అమరావతి రాజధాని నిర్మాణం మళ్లీ ఊపందుకోవడంతో, ఈ వ్యవహారంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌ మొదటి నుంచీ అమరావతి అంశంలో తడబడుతూ వస్తున్నప్పటికీ, ఇప్పుడు సరికొత్త వ్యూహానికి పూనుకుంటున్నట్లు సమాచారం.

తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చాక అమరావతిని రాజధానిగా నిర్ణయించింది. అప్పట్లో జగన్‌ కూడా దానికి ఎత్తిపోతలుగా నిరసన తెలియచేయలేదు. ఎందుకంటే అమరావతికి వ్యతిరేకత రాజకీయంగా సమస్యలు తెచ్చిపెడుతుందన్న ఆలోచన ఆయనకు ఉండేది. అప్పుడు జగన్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని వ్యూహాత్మకంగా వినియోగించారు. రైతులు ఇచ్చిన భూముల విషయంలో అసంతృప్తి ఉన్నవారిని ప్రోత్సహించి, కోర్టుల్లో కేసులు వేయించడంలో ఆళ్ల కీలకపాత్ర పోషించారు. ఆ కేసుల మీద వస్తున్న తీర్పులను వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందింది.

తాజా ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వకుండా బీసీ నాయకురాలు కాండ్రు కమలను నిలిపారు. కానీ నారా లోకేష్ ఘనవిజయం సాధించడంతో ఆ ప్లాన్ విఫలమైంది. ఆ తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి కొంతకాలం కాంగ్రెస్‌లోకి వెళ్లి మళ్లీ వైసీపీ లోకి తిరిగివచ్చారు. ఎన్నికల్లో పార్టీకి సపోర్ట్ ఇచ్చినా విజయాన్ని సాధించలేకపోయారు.

ఇప్పుడు పరిస్థితులు మారడంతో జగన్ మళ్లీ ఆళ్లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలపై అవినీతి, లోపాలను బయటకు తీసి రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఆళ్లను ఇన్‌చార్జ్ చేయాలని జగన్ నిర్ణయించారని సమాచారం. పార్టీ స్థాయిలో అధికారిక బాధ్యతలు అప్పగించి, అమరావతి అంశంపై పూర్తి దృష్టి పెట్టేలా ఆళ్లను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి, ఒకప్పుడు వదిలేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు జగన్‌కు మళ్లీ అవసరమయ్యారు. అందుకే, ఆయనను పిలిచి మరీ అమరావతిలో కీలక పాత్ర ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

Trending today

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే,...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

Topics

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే,...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

Related Articles

Popular Categories