Top Stories

ముహూర్తం ఖరారు? 8 మంది మంత్రులకు ఉద్వాసన?

ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో 24 మంది మంత్రులున్నారు. జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. పలువురు మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా క్యాబినెట్‌లో తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై మంత్రులైన పదిమందిలో చాలామంది పనితీరు ఆశించిన స్థాయిలో లేదని ప్రచారం జరుగుతోంది. వారి ఎంపిక సమయంలోనే, అత్యవసరం అయితే మంత్రివర్గ విస్తరణ చేపడతామని, ఆ సమయంలో పదవులు వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలని సీఎం సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ఎనిమిది మంది మంత్రులకు ఉద్వాసన పలుకుతారని తాజాగా ప్రచారం ప్రారంభమైంది.

మిత్రపక్షాలకు ప్రాధాన్యత, సీనియర్లకు చోటు?
మరోవైపు, మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం తప్పనిసరి అని, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ నిర్ణయమే ఫైనల్ అని తెలుస్తోంది. బీజేపీకి ప్రస్తుతం ఉన్న ఒక మంత్రి పదవికి అదనంగా మరో పదవి కేటాయిస్తారని కూడా ప్రచారం సాగుతోంది. మిత్రపక్షాలకు ప్రాధాన్యం పెంచుతూనే, పార్టీలోని సీనియర్లను క్యాబినెట్లోకి తీసుకోవాలని చంద్రబాబు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ఆగస్టు 15లోగా ప్రక్షాళన ఉంటుందని సమాచారం రావడంతో, టీడీపీలో ఏ సీనియర్లకు మంత్రి పదవులు దక్కుతాయి, బీజేపీలో ఎవరికి అవకాశం లభిస్తుంది అనే చర్చ ప్రారంభమైంది.

మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు: వినిపిస్తున్న పేర్లు
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజును మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఒకవేళ ఇది జరిగితే, రఘురామకృష్ణం రాజు స్థానంలో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని డిప్యూటీ స్పీకర్‌గా చేస్తారని సమాచారం. జనసేన నుంచి మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్‌ను తప్పించి కొణతాల రామకృష్ణకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది.

ప్రాంతాలవారీగా పరిశీలిస్తే:

ఉత్తరాంధ్ర: ఉత్తరాంధ్ర నుంచి ముగ్గురు మంత్రులను తప్పించడం ఖాయమని తెలుస్తోంది. వీరిలో పల్లా శ్రీనివాస్, కొణతాల రామకృష్ణ, కళా వెంకట్రావుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

గోదావరి జిల్లాలు: గోదావరి జిల్లాలకు చెందిన వాసంశెట్టి సుభాష్‌ను తప్పించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.

నెల్లూరు: ప్రస్తుతం నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిని తప్పించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకుంటారని సమాచారం.

రాయలసీమ: రాయలసీమ నుంచి సైతం చేర్పులు మార్పులు ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక మంత్రిని తప్పించి ఆ స్థానంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారని ప్రచారం సాగుతోంది.

కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా నుంచి ఒక మంత్రిపై వేటు వేస్తారని తెలుస్తోంది.

సామాజిక, ప్రాంతీయ సమీకరణలకు పెద్దపీట
సామాజిక, ప్రాంతీయ సమీకరణలకు అనుగుణంగా తుది నిర్ణయాలు జరగనున్నాయి. అన్ని సమీకరణలను ప్రామాణికంగా తీసుకుని చేర్పులు మార్పులు ఉంటాయని సమాచారం. ఒకేసారి ఎనిమిది మంది మంత్రులను తప్పించడం రాజకీయంగా పెను సంచలనం కానుంది. మంత్రివర్గ విస్తరణపై అధికారిక ప్రకటన కోసం ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Trending today

టీడీపీలో హాట్ టాపిక్ గా లేడీ ఎమ్మెల్యే

టీడీపీ వర్గాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చర్చకు వస్తున్న పేరు...

కాపు నేతలకు వైసీపీ ఫోన్లు.. తేలిపోయిన పవన్ బలం!

ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలు కాపు సామాజిక వర్గ రాజకీయ దిశను...

‘దువ్వాడ’ బాధ అంతా ఇంతా కాదు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై నెలకొన్న వివాదం రాష్ట్ర...

కమల్ హాసన్ కు వార్నింగ్ ఇచ్చిన టీవీ5 సాంబశివరావు

కమల్ హాసన్‌పై టీవీ5 యాంకర్ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్...

అంబటి రాంబాబుకు బెయిల్ రాకుండా కుట్ర?

మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్‌ తర్వాత ఆయనకు బెయిల్ దక్కుతుందా?...

Topics

టీడీపీలో హాట్ టాపిక్ గా లేడీ ఎమ్మెల్యే

టీడీపీ వర్గాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చర్చకు వస్తున్న పేరు...

కాపు నేతలకు వైసీపీ ఫోన్లు.. తేలిపోయిన పవన్ బలం!

ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలు కాపు సామాజిక వర్గ రాజకీయ దిశను...

‘దువ్వాడ’ బాధ అంతా ఇంతా కాదు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై నెలకొన్న వివాదం రాష్ట్ర...

కమల్ హాసన్ కు వార్నింగ్ ఇచ్చిన టీవీ5 సాంబశివరావు

కమల్ హాసన్‌పై టీవీ5 యాంకర్ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్...

అంబటి రాంబాబుకు బెయిల్ రాకుండా కుట్ర?

మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్‌ తర్వాత ఆయనకు బెయిల్ దక్కుతుందా?...

నాగబాబు ప్రాబ్లం ఏంటి?

జనసేన నేత నాగబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర...

లవర్స్ డేకు హోటళ్లలో భారీ అడ్వాన్స్‌డ్ బుకింగ్స్

వాలెంటైన్స్ డే సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా హోటళ్లలో అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ భారీగా...

బీఆర్ఎస్, వైసీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ అక్కసు

ఆంధ్రజ్యోతి పత్రికలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కొత్తపలుకు పేరిట రాసిన వ్యాఖ్యలు...

Related Articles

Popular Categories