Top Stories

ప్లీజ్ పవన్ సినిమా హిట్ చేయండి : నాదెండ్ల ఆడియో లీక్

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ను విజయవంతం చేయాలని జనసేన నాయకులకు, కార్యకర్తలకు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా జనసేన ఎమ్మెల్యేలు, జన సైనికులతో మాట్లాడిన ఆయన, సినిమాకు మద్దతుగా నిలవాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఈ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే మూడుసార్లు నాదెండ్ల మనోహర్ జనసేన నేతలతో ఈ విషయంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది.

నాదెండ్ల మనోహర్ చేసిన ముఖ్య విజ్ఞప్తులు

జనసైనికులు డబ్బులు పెట్టి టిక్కెట్లు కొని సినిమా చూడాలని, ఇతరులకు కూడా సినిమా చూసేలా చేయాలని మనోహర్ కోరారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడానికి కూటమి నేతల మద్దతు కూడా తీసుకోవాలని సూచించారు. ‘హరిహర వీరమల్లు’కు నెగటివ్ టాక్ వస్తోందని, దాన్ని మార్చడానికి వారం రోజుల పాటు సినిమాకు మద్దతు ఇవ్వాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గకుండా ఉండాలంటే అందరూ సినిమా చూడాలని, మరో ఐదు రోజులు ఈ సినిమాను అందరూ చూసేలా చేయాలని తెలిపారు. ఈ సినిమా ద్వారా ప్రజల్లోకి వెళ్లే అవకాశం దొరుకుతుందని, గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకులంతా సినిమా కోసం పనిచేయాలని ఆదేశించారు. ప్రతి థియేటర్‌కి వెళ్లి కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఆరా తీయాలని, అందరినీ సినిమాకు తీసుకొచ్చే బాధ్యత జనసైనికులదేనని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. డబ్బులు లేనివారికి డబ్బులు ఇచ్చి సినిమా చూపించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.

కాగా, ఈ సినిమాను విజయవంతం చేయడానికి జనసేన శ్రేణులు కలిసికట్టుగా కృషి చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించిన నేపథ్యంలోనే ఈ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించినట్లు సమాచారం.

https://x.com/TeluguScribe/status/1949037868443181367

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories