Top Stories

వైఎస్ జగన్ ఆందోళన

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దారుణంగా దిగజారిందని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి త్రైమాసిక గణాంకాలను ప్రస్తావిస్తూ.. రాష్ట్ర ఆర్థిక స్థితి క్షీణించిందని స్పష్టంగా పేర్కొన్నారు.

కాగ్‌ (CAG) విడుదల చేసిన మంత్లీ కీ ఇండికేటర్‌ నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం గణనీయంగా క్షీణించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నివేదికలో రాష్ట్రానికి వచ్చే ఆదాయ వనరులు — పన్నులు మరియు పన్నేతర ఆదాయాలు — భారీగా తగ్గిపోయాయని చెప్పారు. జీఎస్‌టీ, సేల్స్‌ టాక్స్‌ వసూళ్లు కూడా గతేడాది ఇదే కాలంతో పోల్చితే తక్కువగా నమోదయ్యాయని వెల్లడించారు.

ఇది రాష్ట్రంపై పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడికి సంకేతమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తమ ఖర్చులను సొంత ఆదాయాల కంటే అప్పులపై ఆధారపడి నడుపుతోందని విమర్శించారు. ఇది ఆర్థిక స్థిరత్వానికి తీవ్రమైన ప్రమాదమని హెచ్చరించారు.

ఇక గతంలో వైఎస్సార్‌సీపీ పాలన సమయంలో అప్పులపై చేసిన తప్పుడు ఆరోపణలను గుర్తు చేస్తూ, చంద్రబాబు రూ.14 లక్షల కోట్ల అప్పు చేశారని ప్రాచుర్యం కల్పించిన విషయాన్ని జగన్ తిరిగి గుర్తు చేశారు. అంతేకాదు, “ఏపీ మరో శ్రీలంక అవుతోంది” అంటూ judi bola భయాందోళనలు రెచ్చగొట్టారని ఆరోపించారు.

అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలన కాలంలో రాష్ట్రం తీసుకున్న మొత్తం అప్పు రూ.3,39,580 కోట్లు మాత్రమేనని తాజాగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో వెల్లడించిన సంగతి గుర్తు చేశారు.

అదే సమయంలో, చంద్రబాబు కూటమి ప్రభుత్వం మాత్రం ఒక్క సంవత్సరం వ్యవధిలోనే రూ.1,37,546 కోట్లు అప్పుగా తీసుకోవడం ఆశ్చర్యకరమైన విషయమని జగన్ ఎద్దేవా చేశారు. ప్రతీ మంగళవారం ‘అప్పుల మంగళవారంగా’ మారిందని విమర్శించారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద ప్రమాదమేనని, ప్రజల భవిష్యత్తు కోసం తక్షణమే దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ తెలిపారు.

Trending today

టీడీపీలో హాట్ టాపిక్ గా లేడీ ఎమ్మెల్యే

టీడీపీ వర్గాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చర్చకు వస్తున్న పేరు...

కాపు నేతలకు వైసీపీ ఫోన్లు.. తేలిపోయిన పవన్ బలం!

ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలు కాపు సామాజిక వర్గ రాజకీయ దిశను...

‘దువ్వాడ’ బాధ అంతా ఇంతా కాదు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై నెలకొన్న వివాదం రాష్ట్ర...

కమల్ హాసన్ కు వార్నింగ్ ఇచ్చిన టీవీ5 సాంబశివరావు

కమల్ హాసన్‌పై టీవీ5 యాంకర్ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్...

అంబటి రాంబాబుకు బెయిల్ రాకుండా కుట్ర?

మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్‌ తర్వాత ఆయనకు బెయిల్ దక్కుతుందా?...

Topics

టీడీపీలో హాట్ టాపిక్ గా లేడీ ఎమ్మెల్యే

టీడీపీ వర్గాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చర్చకు వస్తున్న పేరు...

కాపు నేతలకు వైసీపీ ఫోన్లు.. తేలిపోయిన పవన్ బలం!

ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలు కాపు సామాజిక వర్గ రాజకీయ దిశను...

‘దువ్వాడ’ బాధ అంతా ఇంతా కాదు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై నెలకొన్న వివాదం రాష్ట్ర...

కమల్ హాసన్ కు వార్నింగ్ ఇచ్చిన టీవీ5 సాంబశివరావు

కమల్ హాసన్‌పై టీవీ5 యాంకర్ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్...

అంబటి రాంబాబుకు బెయిల్ రాకుండా కుట్ర?

మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్‌ తర్వాత ఆయనకు బెయిల్ దక్కుతుందా?...

నాగబాబు ప్రాబ్లం ఏంటి?

జనసేన నేత నాగబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర...

లవర్స్ డేకు హోటళ్లలో భారీ అడ్వాన్స్‌డ్ బుకింగ్స్

వాలెంటైన్స్ డే సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా హోటళ్లలో అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ భారీగా...

బీఆర్ఎస్, వైసీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ అక్కసు

ఆంధ్రజ్యోతి పత్రికలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కొత్తపలుకు పేరిట రాసిన వ్యాఖ్యలు...

Related Articles

Popular Categories