Top Stories

పవన్ ఎక్కడ?

 

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఓ మత్స్యకార మహిళ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి రావడం లేదని, ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

“వాట్లతోనే ఓట్లు.. తర్వాత మాత్రం కనిపించలేరు” అంటూ ఆమె పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. తాము మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నామని, తమ గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా తాగునీరు లేవని ఆమె అన్నారు. పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి ఒక్కసారి కూడా పిఠాపురం రాలేదని, కనీసం ఆయన సిబ్బంది కూడా అందుబాటులో లేరని ఆమె ఆరోపించారు.

“డిప్యూటీ సీఎం అనేది పెద్ద పదవి. రాష్ట్రమంతా అందుబాటులో ఉండాల్సిన వ్యక్తి. కానీ ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నారు” అని ఆమె ప్రశ్నించారు. ప్రజలను పట్టించుకోకుండా పదవిని ఆస్వాదించడం సరికాదని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.

“పవన్ గారిని ఎంతో నమ్మకం పెట్టుకొని గెలిపించాం. కానీ ఇప్పుడు మేము ఓట్లు వేసిన వారు పక్క రాష్ట్రంలో విశ్రాంతి తీసుకుంటే, మేము కష్టాల్లో మునిగిపోతున్నాం” అని ఆమె నిస్సహాయత వ్యక్తం చేశారు.

ఈ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో, పిఠాపురం ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గెలిచిన తర్వాత మర్చిపోవడం నాయకుల పట్ల నమ్మకాన్ని దెబ్బతీస్తోందని వారు పేర్కొన్నారు. ఈ మహిళ వ్యాఖ్యలు రాష్ట్రంలోని సామాన్య ప్రజల భావోద్వేగాలకు ప్రతిబింబంగా నిలుస్తాయని వారు అంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను విస్మరించే నాయకులకు ఇది ఒక హెచ్చరికగా మారవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

https://x.com/UttarandhraNow/status/1950945002403574195

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories