టెలివిజన్ మీడియా వేదికగా ఒకవైపు, సోషల్ మీడియా వేదికగా మరోవైపు ఘర్షణాత్మక వ్యాఖ్యలతో టీవీ5 సీనియర్ జర్నలిస్టు సాంబశివరావు – యూకే వైసీపీ ఫాలోవర్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి మధ్య మాటల యుద్ధం చెలరేగింది.
చంద్రబాబుకు అనుకూలంగా ఉంటుందనే ఆరోపణలతో తరచూ టీవీ5, ముఖ్యంగా సాంబశివరావుపై వైసీపీ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తుంటారు. ఈ క్రమంలో డాక్టర్ ప్రదీప్ రెడ్డి యూకే వైసీపీ ఫోరంలో కీలకంగా వ్యవహరిస్తూ, టీవీ5 సాంబాపై పదేపదే విమర్శలు గుప్పిస్తున్నారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సాంబశివరావు, తన టీవీ5 వేదికగానే ఏకంగా సవాల్ విసిరారు. “నిజంగా దమ్ముంటే ఏపీకి రండి. జూబ్లీహిల్స్ చౌరస్తాలో ఎదురెదురుగా కూర్చొని చర్చిద్దాం” అంటూ సవాలు విసరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇక దీనిపై ప్రదీప్ రెడ్డి ఘాటుగా ప్రతిస్పందించారు. “నువ్వు జర్నలిస్టువా? లేక వీధి రౌడీవా? చౌరస్తాలో కొట్టుకుందామా అని సవాల్ విసరడం నీ స్థాయేంటో చూపిస్తుంది. బాలయ్య డైలాగులు చెప్పడం నీ పని కాదు. జర్నలిస్టుగా వేషం వేసుకున్నా అసలు ధోరణి మాత్రం రౌడీయిజం. చంద్రబాబు మోచేతినీళ్లు తాగుతావు తప్ప నిన్ను ఎవడూ పట్టించుకోడు” అంటూ ఎద్దేవా చేశారు.
ఈ మాటల యుద్ధం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తోంది. ఒకవైపు సాంబశివరావు వైఖరిని తప్పుబడుతుంటే, మరోవైపు ఆయనకు మద్దతు పలుకుతున్నవారు కూడా ఉన్నారు. మొత్తానికి సాంబా–ప్రదీప్ రెడ్డి వాగ్వాదం తెలుగు రాష్ట్రాల్లో కొత్త వివాదానికి నాంది పలికింది.