రాష్ట్ర రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకుపైగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా పేరుగాంచారు. కానీ ఆయన సంపద పెరుగుదలపై ఎప్పటికప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. దీంతో చంద్రబాబును తన చానెల్ లో పొగిడే టీవీ5 సాంబశివరావు దీనిపై సమాధానం ఇవ్వాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పెరిగారు. ప్రారంభ దశలో ఆయనకు కేవలం రెండు ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్టు సమాచారం. కానీ రాజకీయాల్లోకి అడుగుపెట్టి, క్రమంగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన తర్వాత ఆయన ఆర్థిక స్థితిలో విపరీతమైన మార్పు చోటుచేసుకుంది.
ఆస్తుల పెరుగుదల గణాంకాలు
2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో చంద్రబాబు ప్రకటించిన ఆస్తుల విలువ రూ.177 కోట్లుగా ఉంది.
2024లో మళ్లీ సీఎం అయ్యేనాటికి ఆయన ఆస్తులు రూ.931 కోట్లకు పెరిగాయి.
దాదాపు పది సంవత్సరాల్లో ఆయన సంపద ఐదు రెట్లు పెరిగిన విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయన ఆస్తుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ధి అనే పేరుతో పెట్టుబడులు, ప్రాజెక్టులు తెచ్చినా… అదే సమయంలో తన కుటుంబ ఆర్థిక స్థితి అమాంతం పెరగడం ప్రజల్లో అనేక సందేహాలను రేకెత్తిస్తోంది.
డబ్బుల వ్యామోహం లేని నేత అయితే ఇంత విపరీతంగా సంపద ఎలా పెరిగింది? సాధారణంగా వ్యవసాయం లేదా వ్యాపారం ద్వారా ఇలాంటి కోట్లు కూడగట్టడం సాధ్యం కాదు. అయితే రాజకీయ ప్రభావం, అధికారంలో ఉండే శక్తి కారణంగానే ఇంతటి ఆస్తి పెరిగిందా అనే ప్రశ్నలు ప్రజలలో గట్టిగా వినిపిస్తున్నాయి.
చంద్రబాబు నాయుడు ఆస్తుల పెరుగుదలపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆయన రాజకీయ వారసత్వం, పరిపాలనా శైలి ఎంతగానో విశేషమైనదే అయినప్పటికీ, “డబ్బుల వ్యామోహం లేకపోతే… 2 ఎకరాల నుండి అత్యంత ధనిక సీఎంగా ఎలా ఎదిగారు?” అన్న ప్రశ్న మాత్రం ఎప్పటికీ హాట్ టాపిక్గానే మిగిలిపోతుంది.