మరో ఎనిమిది రోజుల్లో పవన్ కళ్యాణ్ నటించిన పాన్ ఇండియా సినిమా ఓజీ గ్రాండ్ రిలీజ్కి సిద్ధమవుతోంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ చిత్రం కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇక చిత్ర ప్రమోషన్లలో హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫుల్ స్వింగ్లో ఉంది. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. “ఓజీ లో నేను చేసిన ‘కన్మణి’ పాత్ర ఇప్పటివరకు నా కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్. ఇది కేవలం యాక్షన్ మూవీ మాత్రమే కాదు, భావోద్వేగాలతో నిండిన ఫ్యామిలీ డ్రామా కూడా” అని ఆమె చెప్పింది.
అలాగే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ – “డిప్యూటీ సీఎం అయ్యాక ఆయనలో చాలా మార్పు గమనించాను. ముందెప్పుడూ ఆలోచనలలో మునిగిపోయినట్లు కనిపించేవారు. కానీ ఇప్పుడు ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా నవ్వుతూ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆ మార్పు నిజంగా ప్రేరణాత్మకం” అని పేర్కొంది.
ప్రియాంక మోహన్ మాటలు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచాయి. ఇప్పటికే విడుదలైన కంటెంట్ అద్భుతంగా ఉండటంతో, ఓజీ బ్లాక్బస్టర్ అవుతుందన్న నమ్మకం మరింత బలపడుతోంది.