వచ్చేశాడండీ జాల్ రెడ్డి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చంద్రబాబు హయాంలో మరింత దారుణంగా తయారైంది.. తాజాగా‘గోదావరి యాస’లో ఓ యువకుడు బయటపెట్టిన డేటా చంద్రబాబును కడిగిపారేసేలా ఉంది. ఆ యాసలో అతడు ఆసక్తికరంగా ప్రశ్నించాడు. రాష్ట్ర అభివృద్ధి రేటు కంటే అప్పుల వృద్ధి రేటు అధికంగా ఉండడం ఆర్థిక విధ్వంసం కాదా? చంద్రబాబు అంటూ ప్రశ్నించాడు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర అప్పుల వృద్ధి రేటు 13.92% కాగా, అభివృద్ధి రేటు 10.23% మాత్రమే ఉంది. అంటే, అప్పులు పెరిగిన వేగం, ఆర్థిక వృద్ధికి పోల్చితే ఎక్కువ. అయితే, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన నిధులు వంటి అంశాలు పక్కాగా ప్రజలకు అందాయి..

దేశవ్యాప్తంగా చూస్తే, ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో అప్పుల వృద్ధి రేటు 12.80% కాగా, దేశ వృద్ధి రేటు 9.38% ఉంది. ఇది కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్న పరిస్థితిని పోలి ఉంటుంది. అంటే, అభివృద్ధి కంటే అప్పులు పెరుగుతున్నాయని భావించవచ్చు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనలో అప్పుల వృద్ధి రేటు 15.43% కాగా, రాష్ట్ర వృద్ధి రేటు 13.43% గా ఉంది. అంటే అప్పుల పెరుగుదల ఆ సమయంలో మరింత ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. అయినప్పటికీ, అప్పట్లో జగన్ హయాంలో ప్రాజెక్టుల కట్టారు.. పెట్టుబడుల రాక వంటి అంశాలు, నవరత్నాలు అమలు చేసి సత్తా చాటారు. మరి చంద్రబాబు ఎందుకు ఇవన్నీ చేయలేక చేతులెత్తేసారన్నది వైసీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

జగన్ పాలనలో సంక్షేమ పథకాలు అధికంగా అమలు చేయడం వల్ల ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరింది. చంద్రబాబు హయాంలో మౌలిక సదుపాయాల పెంపు, పెట్టుబడులు అందించడం వంటి అంశాల్లో ఏమాత్రం పెరుగుదల లేదు. అసలు సంక్షేమ పథకాల జాడే లేదు. కానీ అప్పుల పెరుగుదల తగ్గించలేకపోయారని చెబుతున్నారు.

ఆర్థిక విధ్వంసం నిజంగా ఎవరి పాలనలో జరిగింది? అంటే చంద్రబాబు పాలనలోనే.. అభివృద్ధి లేకుండా అప్పులు పెరగడమే ఆర్థిక విధ్వంసం. ఇది కూటమి సర్కార్ హయాంలోనే సాగింది అనడానికి ఈ లెక్కలే ప్రత్యక్ష ఉదాహరణ.

ఈ గోదావరి యాస యువకుడు ఇదే చెప్పి ఇప్పుడు కూటమి సర్కార్ లెక్క తేల్చాడు. ఆర్థిక విధ్వంసం జరిగింది ఎవరి హయాంలోనో పూసగుచ్చినట్టు వివరించాడు.

వీడియో కోసం క్లిక్ చేయండి