Top Stories

అబద్దాల సేనాని.. వైరల్‌ వీడియో

రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిదే బాధ్యత అన్నట్టుగా మాట్లాడుతుంటారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు ఐదు నెలలు అవుతోంది. ఇప్పటికీ ఆయన జగన్మోహన్‌రెడ్డిపై ఏడుపుగొట్టు మాటలు మాత్రం మానడం లేదు. పవన్‌ కల్యాణ్‌ ఏది మాట్లాడినా తలా, తోకా ఎలా ఉండదో.. అందులో నిజాలు కూడా అస్సలే ఉండవు. ఈ విషయం రాష్ట్రంలోని ప్రజలకే కాదు.. ఆయన అభిమానులకు కూడా తెలుసు. తాజాగా ఆయన నోటి నుంచి జాలువారినా ముత్యాల్లో కొన్నింటిని చూస్తున్న ఎంతో మంది నవ్వుకుంటున్నారు. ఓరేయ్‌ ఆయనకు ఎవడైనా చెప్పండిరా ఈ రాష్ట్రానికి సీఎంగా చంబ్రాబు, డిప్యూటీ సీఎంగా ఆయనే ఉన్నాడని అంటూ సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వేసుకుంటున్నారు.

ఇంతకీ విషయానికి వస్తే.. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా వ్యాప్తి చెంది సుమారు 16 మంది మృతి చెందారు. తాగునీటి కలుషితంతో గడిచిన వారం రోజుల్లో వీరంతా మృతి చెందారు. వీరిని పరామర్శించేందుకు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ గారు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంరతం మీడియాతో మాట్లాడిన ఆయన డయేరియా వ్యాప్తికి బాధ్యత మాజీ సీఎం జగన్‌దే అన్నట్టు మాట్లాడారు. డయేరియా వ్యాప్తికి కారణం పరిశీలిస్తే గత వైసీపీ ప్రభుత్వం ఫిల్టర్‌ బెడ్స్‌ మార్చకపోవడం వల్లే ఈ సమస్య వచ్చినట్టు పేర్కొన్నారు. పనిలో పనిగా గత వైసీపీ ప్రభుత్వం ముందు చూపుతో నిర్మించిన రుషికొండ భవనంపైనా ఆయన ఏడుపును వెళ్లగక్కారు. రుషికొండ లాంటి భవనాలకు ఖర్చు చేసేందుకు నిధులు ఉన్నాయి గానీ.. ప్రజలకు అవసరమైన ఇటువంటి పనులు చేసేందుకు నిధులు వెచ్చించలేదన్నట్టుగా ఆయన మాట్లాడారు.

ఈ వ్యాఖ్యలు చూసిన ఎంతో మంది.. వేయి కోట్లు వరకు వెచ్చించి ఉద్ధానంలో కట్టి కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, తాగునీటి సరఫరా ప్రాజెక్ట్‌ను మర్చిపోయారా..? పవన్‌ అంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో కట్టిన మెడికల్‌ కాలేజీలను చూసైనా మారండి అంటూ పలువురు హితబోధ చేస్తుండగా.. మరికొంత మంది పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌గా తాగునీటి సరఫరా విషయంలో ఏపీ ప్రభుత్వానికి గతంలో కేంద్రం ప్రకటించిన ర్యాంకులను గుర్తు చేస్తున్నారు. ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచి నీటి సరఫరాలో ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని కేంద్రం గతంలో కితాబిచ్చింది. గ్రామీణ ప్రజలకు అందించే తాగునీటికి రెండుసార్లు నాణ్యత పరీక్షలు చేయడంతోపాటు కలుషితంగా తేలిన చోట్ల చేసిన ప్రత్నామ్నాయ ఏర్పాట్లను గుర్తించి కేంద్రం ర్యాంకులను కేటాయించింది.

ఈ చర్యలను గుర్తించిన కేంద్ర జలశక్తి శాఖ ఏపీకి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకును కేటాయించింది. ఇవేమీ తెలియకుండా పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికీ గత ప్రభుత్వంపై బుదరజల్లేలా వ్యాఖ్యానించడం పట్ల పలువురు నవ్వుకుంటున్నారు. ఇప్పటికీ జగనే సీఎం అన్న భావనలో పవన్‌ కల్యాణ్‌ ఉండడం వల్లే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోకు సంబంధించిన మీమ్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

https://x.com/JaganannaCNCTS/status/1848710908119552514

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories