ఈ బొంగులో విజన్ 2047 ఎవడిక్కావాలి అంటున్న ‘భాదాకృష్ణ’

చంద్రబాబు విజన్ 2047పై సొంత పార్టీ నుంచి.. సొంత ఎల్లో మీడియా నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు విజన్ 2047 వేస్ట్ అంటూ ఆయన అనుంగ మీడియా మిత్రుడు రాధాకృష్ణ తేల్చేశాడు. తాజాగా కొత్త పలుకులో ఈ మేరకు బాబు స్ట్రాటజీ శుద్ధ తప్పు అంటూ కుండబద్దలు కొట్టాడు.

విజన్ లేదు వంకాయ లేదు ఒట్టి సొల్లు అంటున్న రాధాకృష్ణ ఈ ఆదివారం చంద్రబాబు కాలయాపన రాజకీయంపై గట్టిగానే ఇచ్చేసుకున్నాడు. గోక్కోవడానికి కూడా పనికి రాని ఈ బొంగులో విజన్ 2047 ఎవడిక్కావాలి అంటూ రెచ్చిపోయారు.

చంద్రబాబు గతంలో విజన్ 2020 అంటూ మొదలుపెట్టి ఎటూ కాకుండా చేశాడు. 2019లో దారుణంగా ఓడిపోయి అసలు విజనరీ కాదన్న విమర్శలను తెచ్చుకున్నారు. ఇప్పుడు అసలు వచ్చేసారి గెలుపే కష్టమని అందరూ అనుకుంటుంటే ఏకంగా విజన్ 2027 అంటూ మొదలుపెట్టాడు. ఇదే ఏబీఎన్ ఆర్కేకు నచ్చలేదు. అందుకే ఆడేసుకుంటున్నారు.

వచ్చేసారి గెలవడం.. ప్రకటించిన హామీలు అమలు చేయడం అటుంచి ఎప్పుడో విజన్ 2047 ప్రకటించడం ఏంటని.. అలవి కానీ ఈ హామీల వల్లనే చంద్రబాబు ఫెయిల్ అవుతున్నారని ఆర్కే లాంటి టీడీపీ అనుకూల మీడియా మేధావులు కూడా ఆడిపోసుకుంటుండడం మనం చూస్తున్నాం.. మరి ఇప్పటికైనా చంద్రబాబు మారుతాడా? లేదా? అన్నది చూడాలి.

వీడియో కోసం క్లిక్ చేయండి