ఎల్లో మీడియా అంతే.. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి అయితే చంద్రబాబు ఏం చేసినా సంసారం అన్నట్టుగానే ప్రొజెక్ట్ చేస్తుంది. అదే జగన్ మంచి చేసినా వ్యభిచారం అన్నట్టుగా నాట్యమాడుతుంది. వైఎస్ జగన్ హయాంలో స్థలం ఉన్న వారికి ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసింది. దీంతో వారికి నచ్చినట్టు ఇళ్లను వారు కట్టుకున్నారు. కరెంట్ కేబుల్, టైల్స్, సీలింగ్, ఇతర ఇంటి డిజైన్ల విషయంలో ప్రభుత్వం జోక్యం ఉండకూడదని.., లబ్ధిదారుడి ఇష్టాయిష్టాలను గౌరవించాలని ఈ పనిచేసింది.
లబ్ధిదారులకు ఇళ్లు కట్టుకునేందుకు జగన్ ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. వాళ్లకు కావాల్సింది వాళ్లకు ఇచ్చింది. అయితే ఏబీఎన్ రాధాకృష్ణ మాత్రం ఇది జగన్ తప్పు అని.. వారి ఇష్టానికి వదిలేశారని రాసుకొచ్చింది. ఈ విధానం తప్పు అంటూ జగన్ పై నిందలేసింది.
అదే కూటమి ప్రభుత్వం కేంద్రం నిధులు, రాష్ట్ర నిధులు కలిపి లబ్ధిదారులకు ఇళ్లు కట్టిస్తానన్న ప్రక్రియ ఇంతవరకూ పట్టాలెక్కలేదు. దాని గురించి ఈ రాధాకృష్ణ రాయడు. కనీసం జగన్ ఇచ్చిన ఇళ్లను కూడా లబ్దిదారులకు ఇవ్వకుండా రద్దు చేసేస్తారు.
ఇలా రాధాకృష్ణ తీరు ఎలా ఉందంటే.. జగన్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై విషం చిమ్ముతూ కూటమి ప్రభుత్వం ఏం చేయకున్నా వెనకేసుకొస్తూ ఎంత చేయాలో అంత చేస్తోంది. ఇలా జగన్ మీద పడి ఏడ్వడం తప్ప రాధాకృష్ణ ఫేక్ న్యూస్ లతోనే బతుకీడుస్తున్నాడని అర్థమవుతోంది.