ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతాల చెల్లింపులో జాప్యం జరగడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదే తరుణంలో సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాంకర్ వెంకటకృష్ణ చేసినట్లుగా చెబుతున్న కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో, అటు ఉద్యోగులకు, ఇటు ఏబీఎన్ వంటి సంస్థలకు కూడా జీతాలు సకాలంలో అందలేదనే ప్రచారం సాగుతోంది. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి లండన్ పర్యటనకు వెళ్లడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా విభాగం దీనిని “విలాసవంతమైన పర్యటన”గా అభివర్ణిస్తోంది.ఈ పరిణామాలపై వెంకటకృష్ణ తనదైన శైలిలో స్పందిస్తూ.. “చంద్రబాబు ఎప్పుడూ టెక్నాలజీ గురించి అప్డేటెడ్గా ఉంటారు. కానీ సడెన్గా ఇలా కనిపించకుండా పోతారని అనుకోలేదు. ఆయన ఏ గ్రహానికి వెళ్లారో ఎవరికీ తెలియదు” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించినట్లు సమాచారం.
కూటమి ప్రభుత్వం అప్పుల్లో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు విలాసాల విషయంలో వెనక్కి తగ్గడం లేదని, ప్రత్యేక విమానాల్లో విదేశీ ప్రయాణాలు చేస్తూ ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.


