భయపడ్డ ఏబీఎన్ వెంకటకృష్ణ, కిరణ్ రాయల్.. వైసీపీ సోషల్ మీడియా అంటే అట్లుంటదీ 

ఏబీఎన్ వెంకటకృష్ణ షరామామూలుగానే నిన్న రాత్రి పెట్టిన లైవ్ చర్చలో తన బాధను పంచుకున్నాడు జనసేన బహిష్కృతి నేత కిరణ్ రాయల్. వైసీపీ అభిమానుల నుంచి తనపై జరుగుతున్న దాడులను గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కిరణ్ రాయల్ మాట్లాడుతూ, “జగన్ ఫ్యాన్స్ మములొల్లు కాదు సార్.. నిద్ర కూడా సరిగా పట్టడం లేదు. రోజంతా సోషల్ మీడియాలో నాపై దాడులు చేస్తున్నారు. వ్యక్తిగత దూషణలు, ట్రోలింగ్ రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా నన్ను టార్గెట్ చేస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

కిరణ్ రాయల్ ఇటీవలే జనసేన నుంచి బహిష్కృతుడయ్యారు. లక్ష్మీ అనే మహిళను లోబరుచుకొని ఆమె నుంచి కోటికి పైగా రూపాయలు తీసుకొని మోసం చేశాడు. దీంతో ఆమె మీడియాకు ఎక్కి కిరణ్ రాయల్ బండారం బయటపెట్టింది. గతంలో జగన్ ను తిట్టిన కిరణ్ రాయల్ ను ఇప్పుడు వైసీపీ అభిమానులు టార్గెట్ చేసి ఎండగడుతున్నారు. అప్పటి నుంచి ఆయనపై వైసీపీ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారని చెబుతున్నారు. తమ భావాలను వ్యక్తపరిచే అవకాశం లేకుండా ప్రతీ చిన్న విషయంలోనూ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని కిరణ్ రాయల్ నిన్న ఏబీఎన్ వెంకటకృష్నతో చెప్పుకొని బోరుమన్నాడు.

“ఇది నా వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తోంది..”
“ఇలా ట్రోలింగ్ చేయడం వల్ల నా వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడుతోంది. కుటుంబసభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో చేసే నెగెటివ్ ప్రచారం కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నాను” అని కిరణ్ రాయల్ ఆవేదన చెందాడు.

ఇదే కిరణ్ రాయల్ గతంలో జగన్ 2.0 పై నోరుపారేసుకున్నాడు. ఇప్పుడు అడ్డంగా దొరికేసరికి బుక్కూపోయాడు. తనను వైసీపీ అభిమానులు తిడుతున్నారని కిరణ్ రాయల్ ఆవేదన చెందిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి