అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్ నోటిఫికేషన్, పార్లమెంట్ ఆమోదం వంటి ప్రక్రియలతో అమరావతికి శాశ్వత హోదా కల్పించాలన్న ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో న్యాయశాఖ నుంచి కొన్ని సాంకేతిక అభ్యంతరాలు రావడం తో అమరావతికి బ్రేక్ పడుతోంది.. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్న అంశాన్ని బిల్లులో సరిగా ప్రతిబింబించకపోవడమే ఈ చిన్న అడ్డంకికి కారణం. దీనిని సవరించి మళ్లీ ప్రతిపాదించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
అయితే ఈ చిన్న న్యాయపరమైన అంశాన్ని పట్టుకుని అమరావతికి “షాక్” తగిలిందంటూ నెటిజన్లు సంబరాలు చేసుకుంటున్నారు.. సోషల్ మీడియా వేదికగా ప్రచారం జోరందుకుంది.. ఇది కూటమి ప్రభుత్వానికి శరాఘాతంగా మారింది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతిపై స్పష్టమైన ఫోకస్ పెట్టడంతో అసలు పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. . అందుకే చిన్న సాంకేతిక అడ్డంకినే పెద్ద సంక్షోభంగా మారుతోంది… . అమరావతి రాజధాని అంశం తుది గమ్యానికి చేరడం కష్టమేనన్న ప్రచారం సాగుతోంది.

