ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం భాషా యుద్ధం తారస్థాయికి చేరింది. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోందని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఒకే రకమైన మాటలకు ఇద్దరు వ్యక్తులపై రెండు వేర్వేరు చర్యలు ఉండటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
వైసీపీ నాయకులు ఆవేశంలోనో, కడుపు మంటతోనో ఒక మాట అంటే చాలు.. అది క్షణాల్లో వైరల్ అయిపోతోంది. పోలీసుల ఎంట్రీ, అరెస్టులు, నాన్-బెయిలబుల్ కేసులు.. ఇలా సీన్ సినిమా రేంజ్లో సాగిపోతోంది. “చట్టం తన పని తాను చేసుకుపోతోంది” అని అధికార వర్గాలు చెబుతుంటే, అది కేవలం ఒక వర్గానికేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరోవైపు, కూటమి నాయకులు అంతకంటే ఘాటుగా మాట్లాడినా, సదరు మాటలు పక్కా ‘సుభాషితాలు’గా చెలామణి అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి నాయకుల మాటలు ప్రవచనాలుగా మారుతున్నాయా? వారిపై చర్యలు తీసుకోవడానికి చట్టానికి కళ్లు కనిపించడం లేదా? “అధికారంలో ఉన్నప్పుడు మాట ‘మంత్రం’ అవుతుంది.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట ‘నేరం’ అవుతుంది.” అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
తాజాగా ఒక వీడియో సాక్ష్యంగా బయటకు వచ్చినప్పటికీ, కూటమి పెద్దలు దానిపై స్పందించకపోవడం గమనార్హం. “న్యాయం అందరికీ సమానంగా ఉండాలి.. ఒకరికి ఒక రూలు, ఇంకొకరికి ఇంకో రూలా?” అని సామాన్య జనం అడుగుతున్నారు. ఈ వీడియో చూశాకైనా కూటమి పెద్దలు స్పందిస్తారో లేక “ఇవన్నీ రాజకీయ విమర్శలే” అని కొట్టిపారేస్తారో చూడాలి.


