Top Stories

సర్వే : కూటమికి షాక్

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది పూర్తవుతోంది. గత ఏడాది ఇదే తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి పాలన చేపట్టారు. ఇప్పటివరకు ‘సూపర్ 6’ హామీలను అమలు చేసినప్పటికీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని తాజా సర్వేలు సూచిస్తున్నాయి.

రైజ్ సర్వే సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపింది. గతంలో కూటమికి అనుకూలంగా ఫలితాలు ఇచ్చిన ఈ సంస్థ ఇప్పుడు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని హెచ్చరించింది. సంస్థ ప్రతినిధి ప్రవీణ్ పుల్లట వెల్లడించిన వివరాల ప్రకారం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 34 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2024 ఎన్నికల్లో వీటిలో 32 చోట్ల టీడీపీ కూటమి గెలిచింది. వైసీపీ కేవలం రెండు స్థానాలు మాత్రమే దక్కించుకుంది. పార్లమెంట్ స్థానాల విషయంలోనూ కూటమి విజయ పరంపర కొనసాగింది.

అయితే తాజా సర్వేలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి తీవ్రంగా ఉన్నట్లు వెల్లడైంది. 32 మంది కూటమి ఎమ్మెల్యేలలో 17 మందిపై అసంతృప్తి ఉందని, ఇందులో 9 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని రైజ్ సర్వే పేర్కొంది. ఈ వివరాలను ప్రవీణ్ పుల్లట తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్టు హింట్ ఇచ్చారు. మిగిలిన ప్రాంతాల సర్వే వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు సంస్థ తెలిపింది.

ఈ సర్వే ఫలితాలు కూటమి వర్గాల్లో ఆందోళనను కలిగిస్తున్నాయి. గతంలో అనుకూల ఫలితాలు ఇచ్చిన రైజ్ సర్వే ఇప్పుడు వ్యతిరేకంగా ప్రకటించడం గమనార్హం. మరింతగా ఆలోచన కలిగించే అంశం.

ఇదిలా ఉండగా, ప్రభుత్వంపై కూడా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని తాజా సర్వేలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చలేదని ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనిపై అధికార పార్టీ అంతర్గతంగా కూడా సమీక్ష మొదలైంది. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలకు పనితీరు మెరుగుపరుచుకోవాలని ఇప్పటికే హెచ్చరికలు పంపినట్లు సమాచారం.

మొత్తం మీద ఈ సర్వే ఫలితాలు టీడీపీ కూటమికి తలనొప్పిగా మారినట్టు స్పష్టమవుతోంది.

Trending today

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Topics

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

అమరావతి కోసం కదిలిన జగన్..!

అమరావతి అంశంపై గత ఐదేళ్లుగా మౌనంగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి...

‘మహా’ వంశీ అమరావతి లొల్లి

అమరావతి రాజధాని పనులపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అభివృద్ధి ఎక్కడ...

కుప్పం ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ దోపిడీని వైఎస్సార్ కాంగ్రెస్...

Related Articles

Popular Categories