Top Stories

సర్వే : కూటమికి షాక్

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది పూర్తవుతోంది. గత ఏడాది ఇదే తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి పాలన చేపట్టారు. ఇప్పటివరకు ‘సూపర్ 6’ హామీలను అమలు చేసినప్పటికీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని తాజా సర్వేలు సూచిస్తున్నాయి.

రైజ్ సర్వే సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపింది. గతంలో కూటమికి అనుకూలంగా ఫలితాలు ఇచ్చిన ఈ సంస్థ ఇప్పుడు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని హెచ్చరించింది. సంస్థ ప్రతినిధి ప్రవీణ్ పుల్లట వెల్లడించిన వివరాల ప్రకారం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 34 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2024 ఎన్నికల్లో వీటిలో 32 చోట్ల టీడీపీ కూటమి గెలిచింది. వైసీపీ కేవలం రెండు స్థానాలు మాత్రమే దక్కించుకుంది. పార్లమెంట్ స్థానాల విషయంలోనూ కూటమి విజయ పరంపర కొనసాగింది.

అయితే తాజా సర్వేలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి తీవ్రంగా ఉన్నట్లు వెల్లడైంది. 32 మంది కూటమి ఎమ్మెల్యేలలో 17 మందిపై అసంతృప్తి ఉందని, ఇందులో 9 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని రైజ్ సర్వే పేర్కొంది. ఈ వివరాలను ప్రవీణ్ పుల్లట తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్టు హింట్ ఇచ్చారు. మిగిలిన ప్రాంతాల సర్వే వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు సంస్థ తెలిపింది.

ఈ సర్వే ఫలితాలు కూటమి వర్గాల్లో ఆందోళనను కలిగిస్తున్నాయి. గతంలో అనుకూల ఫలితాలు ఇచ్చిన రైజ్ సర్వే ఇప్పుడు వ్యతిరేకంగా ప్రకటించడం గమనార్హం. మరింతగా ఆలోచన కలిగించే అంశం.

ఇదిలా ఉండగా, ప్రభుత్వంపై కూడా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని తాజా సర్వేలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చలేదని ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనిపై అధికార పార్టీ అంతర్గతంగా కూడా సమీక్ష మొదలైంది. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలకు పనితీరు మెరుగుపరుచుకోవాలని ఇప్పటికే హెచ్చరికలు పంపినట్లు సమాచారం.

మొత్తం మీద ఈ సర్వే ఫలితాలు టీడీపీ కూటమికి తలనొప్పిగా మారినట్టు స్పష్టమవుతోంది.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories