బిగ్ బాస్ అంటేనే తెలివైన ఆటగాళ్లు గుర్తొస్తారు. అలాంటివారిలో మొదటగా గుర్తొచ్చే పేరు అభిజిత్. తన కూల్ నెస్, ఎలాంటి సందర్భాన్నైనా సమర్థంగా డీల్ చేసే విధానం ప్రేక్షకులకు ఎప్పటికీ నచ్చేదే. అయితే, ఇటీవల ‘అగ్ని పరీక్ష’ షోలో మనీష్ అనే కంటెస్టెంట్ అభిజిత్కే షాక్ ఇచ్చేలా మాస్టర్ మైండ్ చూపించాడు.
మనీష్ ఒక హై ప్రొఫైల్ ఉన్న పారిశ్రామికవేత్త. అతనికి ఐటీ కంపెనీ కూడా ఉంది. అంతేకాకుండా, ఫోర్బ్స్ జాబితాలో 33వ వ్యక్తిగా నిలిచిన వ్యక్తి. ఇంతటి గొప్ప వ్యక్తి బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారని అభిజిత్ అడగ్గా, “ఒక మనిషి తెలివైన వ్యూహాలతో ఎలా గేమ్ ఆడతాడో చూపించాలని అనుకుంటున్నాను” అని మనీష్ సమాధానమిచ్చాడు. అతని సమాధానాలకు న్యాయమూర్తులు నవదీప్, బిందు మాధవి గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చారు.
కానీ అభిజిత్ మాత్రం ఒక ఆసక్తికరమైన పరీక్ష పెట్టాడు. “ఒక తెల్లని చార్ట్ మీద నీ బొమ్మ గీయి. నీ బొమ్మ ముఖం భాగంపై నా చేతిలో ఉన్న రెడ్ మార్కర్ సిరా పడకుండా చూడాలి. అలా చేయగలిగితేనే నేను రెడ్ ఫ్లాగ్ ఇవ్వను” అని కండీషన్ పెట్టాడు. దానికి మనీష్ చాలా తెలివిగా స్పందించాడు. బొమ్మలో తల భాగాన్ని గీయకుండా వదిలేశాడు. “తల భాగం లేకపోతే మీరు రెడ్ మార్క్ ఎక్కడ వేస్తారు?” అని మనీష్ ప్రశ్నించాడు. అతని తెలివికి అభిజిత్తో పాటు న్యాయమూర్తులు కూడా ఆశ్చర్యపోయారు.
మనీష్ ప్రస్తుతం టాప్ 15 లోకి వెళ్లలేదు. అభిజిత్ అతనికి గ్రీన్ ఫ్లాగ్ ఇవ్వకపోయినా, అతని తెలివిని మాత్రం మెచ్చుకున్నాడు. మనీష్ అగ్ని పరీక్షను దాటుకుని బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెడతాడో లేదో చూడాలి.