Top Stories

తమ్ముడు ఎమ్మెల్సీ అయ్యి ఇంటికొచ్చాడు.. చిరంజీవి చేసిన పని వైరల్

 

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు నిన్న శాసన మండలి చైర్మన్ కొయ్యె మోషేన్ రాజు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు, పలువురు జనసేన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ప్రమాణ స్వీకారం అనంతరం నాగబాబు తన సతీమణితో కలిసి సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. చంద్రబాబు ఆయనకు గౌరవ సత్కారం చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్యాబినెట్ విస్తరణలో నాగబాబు మంత్రివర్గంలోకి చేరే అవకాశం ఉందన్న వార్తలున్నప్పటికీ, అసంతృప్తి రేకెత్తే అవకాశం ఉన్నందున కొన్ని రోజులు ఈ ప్రక్రియను వాయిదా వేశారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు నాగబాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. “ఆంధ్ర ప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన నా తమ్ముడు కొణిదెల నాగబాబుకి ఆత్మీయ అభినందనలు, ఆశీస్సులతో – నీ అన్నయ్య, వదిన” అంటూ చిరంజీవి ట్వీట్ చేయడంతో పాటు కొన్ని ఫోటోలు కూడా షేర్ చేశారు. నాగబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం చిరంజీవి ప్రత్యేకంగా ఒక పెన్ బహుమతిగా అందించగా, అదే పెన్‌తో నాగబాబు సంతకాలు చేశారు.

ఈ ట్వీట్‌కు నాగబాబు కూడా స్పందించారు. “ప్రియమైన అన్నయ్య, మీ ప్రేమాభిమానాలకు నేను ధన్యుడిని. మీరు, వదిన బహుకరించిన పెన్ నాకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఈ పెన్‌ను ఉపయోగించడం నాకు గౌరవంగా భావిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

అయితే నాగబాబు MLC పదవికి ఎంపిక కావడంపై టీడీపీ కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన టీడీపీపై చేసిన విమర్శలు, జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై వేసిన సెటైర్లు ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి విషయంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుంటే, మంత్రివర్గంలో చేరితే ఇంకా ఎక్కువ వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories