Top Stories

షుగర్ వచ్చినోడు బియ్యం తినడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యవసాయ విధానంపై చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు రైతాంగంలో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పెరుగుతున్న డయాబెటిస్ కేసులు, మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్ల నేపథ్యంలో, కేవలం వరి పంటపైనే ఆధారపడటం కంటే ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటలు, ముఖ్యంగా కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను ఆయన గట్టిగా నొక్కి చెప్పారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. “పండించే ధాన్యం తినేవాళ్లు లేరు రాష్ట్రంలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని, అయితే కేవలం ఆ కారణంగానే వరి పండించడం సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. ధాన్యాన్ని వినియోగించే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

“ఎందుకంటే అందరికీ డయాబెటిక్ వచ్చింది. ప్రజలు బియ్యాన్ని తీసుకోవడం తగ్గించడానికి ప్రధాన కారణం విస్తృతమవుతున్న డయాబెటిస్ సమస్యేనని ఆయన సూచించారు. “షుగర్ వచ్చినోడు బియ్యం తినడు” అంటూ మధుమేహం ప్రభావం ఆహారపు అలవాట్లపై ఎంత ఉందో వివరించారు.

“ప్రజలు ఏమి తింటారో, మనం అవే పండించాలి రైతులు మార్కెట్ డిమాండ్‌ను, ప్రజారోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. వరి సాగును తగ్గించి, కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు వంటి వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దీర్ఘకాలికంగా రైతులకు లాభాలు దక్కాలన్నా, ప్రజారోగ్యం మెరుగుపడాలన్నా పంటల వైవిధ్యం అనివార్యమని ఆయన తేల్చి చెప్పారు.

రైతులు సాంప్రదాయ పంటల వైపు నుంచి అధిక విలువ, పోషక విలువలు గల ప్రత్యామ్నాయ పంటలకు మళ్లడం అనేది ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పు. ఈ నేపథ్యంలో రైతులకు నష్టాలు రాకుండా ప్రభుత్వం రాయితీలు, మద్దతు ధరతో కూడిన ప్రోత్సాహకాలు అందిస్తే, సీఎం గారి ‘వ్యవసాయ సలహాలు’ హాస్యాస్పదంగా కాకుండా, వ్యవసాయ విప్లవానికి నాంది పలికే అవకాశం ఉంది.

https://x.com/Anithareddyatp/status/1988793138572628141?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories