Top Stories

బాబు బండారం బయటపెట్టిన రోశయ్య మాట

‘ఓడ దాటేదాక ఓడ మల్లయ్య.. ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య’ అన్న చందంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరు ఉంటుందని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఎన్నికల సమయంలో ఎన్నెన్నో హామీలను ఇస్తుంటారు. అధికారంలోకి రావడానికి అవసరమైతే ఆ చందమామను కూడా ఇంటింటికి ఇచ్చేస్తానని హామీలను చంద్రబాబు ఇచ్చేస్తారు. తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ హామీలను అమలు చేయమని అడిగితే మాత్రం.. ఖజానా ఖాళీగా ఉందని, నిధులు ఎక్కడ నుంచి వస్తాయని తిరిగి ప్రశ్నిస్తుంటారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా ఇటువంటి మోసాలతోనే నెట్టుకుంటూ వస్తున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అలవిగాని హామీలను ఇవ్వడం, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది.

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలను ఇచ్చారు. సూపర్ సిక్స్ అన్నారు. ఇప్పుడు ఆ హామీలను అమలు చేయమని అడుగుతుంటే ఖజానా ఖాళీగా ఉందంటూ కథలు చెబుతున్నారు. దీంతో చంద్రబాబును నమ్మి ఓట్లు వేసిన సాధారణ ప్రజలు నిను నమ్మడం మేము చేసిన తప్పు బాబూ అంటూ వాపోతున్నారు. అయితే, ఇదే విషయాన్ని గతంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కూడా స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చేసిన వ్యాఖ్యలు వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయని రోశయ్య ఆ వీడియోలో పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించేందుకు చంద్రబాబు నాయుడు ఆకాశమే హద్దుగా అనేక వరాలు కురిపించారు. కనిపించిన ప్రతి ఒక్కరికి ఏం కావాలో కోరుకో నరుడా అన్నట్టుగా హామీలను ఇచ్చారు. తీరా ఎన్నికలు పూర్తయిన 15 రోజుల తర్వాత ఆర్థికంగా దివాలా తీసామని, రూపాయి కూడా లేదని చంద్రబాబు దివాలా కోరు వ్యాఖ్యలు చేశారంటూ రోశయ్య తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదని, ఉద్యోగులకు జీతభత్యాలను ఎలా ఇవ్వాలో కూడా తెలియడం లేదంటూ పేర్కొన్న చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వాన్ని ప్రజలే భరించాలని, ప్రజలే నడిపించాలని వాడడం ద్వారా తన అసమర్ధతను అప్పట్లోనే చాటుకున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం దివాలా తీసిందని చెప్పిన ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదంటూ ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. రోశయ్య గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పాలనకు అడ్డంపడుతున్నాయి. గడిచిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు సూపర్ సిక్స్ పేరుతో అనేక హామీలను ఇచ్చిన చంద్రబాబు నాయుడు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారు. కొద్దిరోజుల కిందట అసెంబ్లీలో మీడియాతో మాట్లాడి ఆయన ఈ హామీల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో హామీలను ఇచ్చామని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దీనిపై సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉందని, ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు బాధ్యతగా ఉండాలంటూ ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్గా మారాయి. ఎప్పుడో 20 ఏళ్ల కిందటే చంద్రబాబు నాయుడు నైజాన్ని గుర్తించి రోశయ్య వ్యాఖ్యానించారని.. చంద్రబాబు నాయుడు గురించి రోశయ్య నాడు చెప్పిన మాటలు ప్రస్తుతం అక్షర సత్యాలుగా మరోసారి అన్వయించే పరిస్థితి ఏర్పడిందని పలువురు పేర్కొంటున్నారు.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories