Top Stories

బాబు బండారం బయటపెట్టిన రోశయ్య మాట

‘ఓడ దాటేదాక ఓడ మల్లయ్య.. ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య’ అన్న చందంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరు ఉంటుందని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఎన్నికల సమయంలో ఎన్నెన్నో హామీలను ఇస్తుంటారు. అధికారంలోకి రావడానికి అవసరమైతే ఆ చందమామను కూడా ఇంటింటికి ఇచ్చేస్తానని హామీలను చంద్రబాబు ఇచ్చేస్తారు. తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ హామీలను అమలు చేయమని అడిగితే మాత్రం.. ఖజానా ఖాళీగా ఉందని, నిధులు ఎక్కడ నుంచి వస్తాయని తిరిగి ప్రశ్నిస్తుంటారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా ఇటువంటి మోసాలతోనే నెట్టుకుంటూ వస్తున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అలవిగాని హామీలను ఇవ్వడం, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది.

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలను ఇచ్చారు. సూపర్ సిక్స్ అన్నారు. ఇప్పుడు ఆ హామీలను అమలు చేయమని అడుగుతుంటే ఖజానా ఖాళీగా ఉందంటూ కథలు చెబుతున్నారు. దీంతో చంద్రబాబును నమ్మి ఓట్లు వేసిన సాధారణ ప్రజలు నిను నమ్మడం మేము చేసిన తప్పు బాబూ అంటూ వాపోతున్నారు. అయితే, ఇదే విషయాన్ని గతంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కూడా స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చేసిన వ్యాఖ్యలు వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయని రోశయ్య ఆ వీడియోలో పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించేందుకు చంద్రబాబు నాయుడు ఆకాశమే హద్దుగా అనేక వరాలు కురిపించారు. కనిపించిన ప్రతి ఒక్కరికి ఏం కావాలో కోరుకో నరుడా అన్నట్టుగా హామీలను ఇచ్చారు. తీరా ఎన్నికలు పూర్తయిన 15 రోజుల తర్వాత ఆర్థికంగా దివాలా తీసామని, రూపాయి కూడా లేదని చంద్రబాబు దివాలా కోరు వ్యాఖ్యలు చేశారంటూ రోశయ్య తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదని, ఉద్యోగులకు జీతభత్యాలను ఎలా ఇవ్వాలో కూడా తెలియడం లేదంటూ పేర్కొన్న చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వాన్ని ప్రజలే భరించాలని, ప్రజలే నడిపించాలని వాడడం ద్వారా తన అసమర్ధతను అప్పట్లోనే చాటుకున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం దివాలా తీసిందని చెప్పిన ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదంటూ ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. రోశయ్య గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పాలనకు అడ్డంపడుతున్నాయి. గడిచిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు సూపర్ సిక్స్ పేరుతో అనేక హామీలను ఇచ్చిన చంద్రబాబు నాయుడు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారు. కొద్దిరోజుల కిందట అసెంబ్లీలో మీడియాతో మాట్లాడి ఆయన ఈ హామీల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో హామీలను ఇచ్చామని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దీనిపై సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉందని, ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు బాధ్యతగా ఉండాలంటూ ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్గా మారాయి. ఎప్పుడో 20 ఏళ్ల కిందటే చంద్రబాబు నాయుడు నైజాన్ని గుర్తించి రోశయ్య వ్యాఖ్యానించారని.. చంద్రబాబు నాయుడు గురించి రోశయ్య నాడు చెప్పిన మాటలు ప్రస్తుతం అక్షర సత్యాలుగా మరోసారి అన్వయించే పరిస్థితి ఏర్పడిందని పలువురు పేర్కొంటున్నారు.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories