వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరుకు వెళ్లి మిర్చి రైతులకు సంఘీభావం ప్రకటించిన వేళ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కొత్త రాజకీయ నాటకాన్ని మొదలుపెట్టారు. మిర్చి రైతుల సమస్యల గురించి కేంద్రానికి లేఖ రాశారు.
గుంటూరు మిర్చి రైతులు గిట్టుబాటు ధరల కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి దిగజారడంతో వారు నిరసన బాట పట్టారు. అయితే, ఇన్నాళ్లూ ముఖ్యమంత్రి చంద్రబాబు మిర్చి రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గిట్టుబాటు ధరల కోసం ఏదైనా సమీక్ష నిర్వహించారని చెప్పలేం, మంత్రులను అక్కడికి పంపించారన్న వార్తలు లేవు.
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్వయంగా రైతులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించింది. అయినా కూడా ఆయన వెనుకడగా వేయకుండా రైతులను కలిసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. అంతేకాదు, మీడియా ద్వారా వాటిని బహిరంగంగా వినిపించారు.
జగన్ పర్యటన ప్రభావం పడకుండా చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ప్రభుత్వం తడిగట్టని కుట్రకు పాల్పడిందని విశ్లేషకులు అంటున్నారు. జగన్ రైతులను కలిసిన వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏమాత్రం మద్దతు అందించకుండానే, కేంద్రం నుంచి చర్యలు తీసుకోవాలని కోరడం గమనార్హం.