వచ్చాడండీ జెండా కూలీ జాల్ రెడ్డి

’వినేవాడికి చెప్పేవాడు లోకువ’ అన్నది సామెత.. అలా తయారైంది ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీరు. ఆయన చేసే పని అర్ధ రూపాయి అయితే.. చెప్పే మాటలు ఐదు వందల రూపాయలు అన్నట్టుగా ఉంటాయి. ఇ ప్పుడే అవే ఆయన్ను సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌కు గురి చేస్తున్నాయి.

తాజాగా జెండా కూలీ జెండా కూలీ జాలి రెడ్డిని మాట్లాడుతున్నానంటూ ఓ గోదావరి యువకుడు తన యాసతో పవన్ పై పడిపోయాడు. కలెక్టర్లతో మీటింగ్ లో ప్రజలు తిరగబడేలా ఉన్నారంటూ పవన్ మాటలు అనడంపై సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్యలు కలెక్టర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? కామన్ మ్యాన్స్ కు హింట్ ఇచ్చాడా? అన్నది అర్థం కాకుండా ఉంది. రాళ్లు రప్పలుగా ఉన్న నగరాన్ని బాబోరు భాగ్యనగరంగా మార్చేశాడని పవన్ అన్నారు. అట్లాంటిది రాల్లు రప్పలుగా ఉన్న నగరాలను వదిలేసి ఏటా మూడు పంటలు పండే అమరావతి భూములను బాబోరు ఎందుకు తీసుకున్నారన్నది ఇక్కడ ప్రశ్న. పవన్ ను ఒకప్పుడు తిట్టి ఇప్పుడు చంద్రబాబే పదేళ్లు సీఎంగా ఉండాలన్న నీ తీరు చూసి జనసైనికులు అంతా ఘోళ్లు చస్తున్నారని వాపోయాడు.

పవన్ ను సీఎంగా చూడాలని కలలుగన్న జనసేన కార్యకర్తల కలలు కల్లలయ్యాంటూ ఇక టీడీపీ జెండా మోయడానికేనా తాము ఉన్నది అంటూ ఆ యువకుడు నిట్టూర్చాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి