Top Stories

దువ్వాడతో అది చేస్తే తప్పేనా?: మాధురి

తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది దివ్వెల మాధురి వ్యాఖ్యలు. డాన్సర్‌గా, యాంకర్‌గా, తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న మాధురి ఈసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, మాజీ మంత్రి రోజా పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణిగా ఉన్న మాధురి గత కొద్ది రోజులుగా రాజకీయ వ్యాఖ్యలతో చర్చకు వచ్చారు.

తాజాగా ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, పార్టీ నెపధ్యంలో తన భర్తపై జరిగిన అన్యాయంపై ఘాటుగా స్పందించారు. “మేమిద్దరం కలిసి రీల్స్ చేస్తే తప్పా? అదే పార్టీలో ఉన్న మాజీ మంత్రి రోజా డాన్స్ చేస్తే మాత్రం గొప్పా?” అంటూ మండిపడ్డారు. టీవీ షోల్లో రోజా డాన్స్ చేయడాన్ని ప్రస్తావిస్తూ.. “అది సమంజసమైతే మాది తప్పేలా?” అని ప్రశ్నించారు.

వైసీపీ నాయకత్వం తమను రీల్స్ పేరిట సస్పెండ్ చేయడం దుర్మార్గమని అభిప్రాయపడ్డారు. “ఈ లాజిక్ ప్రకారం పార్టీలో చాలామందిని సస్పెండ్ చేయాలి” అన్నారు. “దువ్వాడ శ్రీనివాస్ పార్టీ కోసం చాలా చేశాడు.. ఇప్పుడది ఎక్కడ ఉంది?” అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. వైసీపీని ‘గాలి పార్టీ’గా, ‘ఇప్పటికే మింగిపోయిన పార్టీ’గా అభివర్ణించారు.

ఇక మాధురి, దువ్వాడ జంట కలిసి పలు వేదికలపై చేసిన డ్యాన్స్ వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలో దువ్వాడపై సస్పెన్షన్ విధించారని వార్తలు రావడం మరింత హీట్ పెంచాయి.

మాధురి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. కొందరు మాధురిని సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి మాధురి చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories