బిగ్ బాస్ హౌస్ లో మాధురి ఎలిమినేషన్ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ మళ్లీ చర్చలోకి వచ్చారు. రాజకీయాల్లో దూకుడు చూపిన ఆయన, ఇప్పుడు వ్యక్తిగత జీవితం కారణంగా మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. మాధురి బిగ్ బాస్ హౌస్లో పాల్గొనడం, ఆమెకు మద్దతుగా దువ్వాడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ కంటెస్టెంట్పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం, హెచ్చరికల తరహా మాటలు ఉపయోగించడం దువ్వాడ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని అనుకున్న ఆయన, ఇటీవల చేసిన ఈ కామెంట్లతో ఆ అవకాశాలు మరింత దూరమయ్యేలా కనిపిస్తున్నాయి.
ఇక మాధురి ఎలిమినేట్ కావడంతో దువ్వాడ శ్రీనివాస్ అక్కినేని నాగార్జునపై కూడా స్పందించే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. ఒకప్పుడు రాజకీయాల్లో దూసుకుపోయిన దువ్వాడ ఇప్పుడు వ్యక్తిగత వ్యవహారాల కారణంగా చర్చల్లో నిలుస్తుండటం విచారకరం అని శ్రీకాకుళం రాజకీయ వర్గాలు అంటున్నాయి.
మొత్తం మీద, బిగ్ బాస్ షో కారణంగా దువ్వాడ శ్రీనివాస్ పేరు మరోసారి హాట్ టాపిక్ అవగా, ఈ సారి ఆయనకు ‘దువ్వాడ గండం’ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

